అదిరిందమ్మా గీతా..!

-

వచ్చిన క్రేజ్ తో వరుస వెంట సినిమాలు చేసి ఆ తర్వాత పెళ్లి చేసుకుని హ్యాపీగా సెటిల్ అయ్యే హీరోయిన్స్ కొంతమంది. అయితే మరికొందరు మాత్రం తమకు వచ్చిన ఈ పాపులారిటీని మంచి పనులు చేసేందుకు ఉపయోగిస్తారు. లేటెస్ట్ గా మన గీత అలాంటి ఓ మంచి పని చేసి అదిరిందమ్మా రష్మిక అనేసేలా చేసింది. ఇంతకీ గీత అలియాస్ రష్మిక ఏం చేసింది అంటే నీటి కాలుష్యం గురించి అందరికి తెలిసేలా ఓ షార్ట్ ఫిల్మ్ చేస్తుంది. మన వల్ల చెరువులు, సరస్సులు ఎలా పాడవుతున్నాయో ఈ షార్ట్ ఫిల్మ్ ద్వారా చెప్పబోతుంది రష్మిక.

బెంగళూరు పరిసర ప్రాంతంలో గల బెల్లందూర్ సరస్సు చాలా పాపులర్. దీనికో చరిత్ర కూడా ఉందని చెబుతుంటారు. అయితే కొన్నాళ్ల క్రితం దీని పరిస్థితి వేరు ఇప్పుడు వేరు. ప్రస్తుతం ఆ సరస్సు పరిస్థితి చూసిన రష్మిక చాలా అప్సెట్ అయ్యిందట. నీటి కాలుష్యం వల్లే ఇది జరిగిందని.. దీనిపై ఓ షార్ట్ ఫిల్మ్ చేస్తుందని తెలుస్తుంది. సన్మతి డి ప్రసాద్ ఈ షార్ట్ ఫిల్మ్ ను డైరెక్ట్ చేస్తున్నాడు.

బెల్లందూర్ సరస్సులో రష్మిక ఫోటో షూట్ లో పాల్గొంది. ఈ సమస్య తీవ్ర లోతుకి వెళ్తే తెలిసిందని సముద్ర జీవాల మృతికి కాలుష్యం కారణమవుతుందని అంటుంది రష్మిక. ఏమో అనుకున్నాం కాని అమ్మడి గట్స్ కు హ్యాట్సాఫ్ చెప్పేస్తున్నారు ఆమె ఫ్యాన్స్. మరి ఆ షార్ట్ ఫిల్మ్ ఎలా ఉంటుందో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news