మళ్లీ పెళ్లికి సీక్వెల్ కూడా.. నరేష్ రివేంజ్ కోసమేనా..?

-

తాజాగా మళ్లీ పెళ్లి టీజర్, ట్రైలర్స్ చూసినవాళ్లంతా కూడా ఇది నరేష్ , పవిత్రల కథే అని అనుకుంటున్నారు.. తాజాగా జరిగిన ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో నరేష్ మాట్లాడుతూ ఈ సినిమాపై పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేయడం ఇప్పుడు మరింత అనుమానాలకు దారితీస్తోంది. ఇకపోతే టాలీవుడ్ లో బాగా వైరల్ అయిన జంట విషయానికి వస్తే.. సీనియర్ నటుడు నరేష్, నటి పవిత్ర లోకేష్ పేర్లు వినిపిస్తాయి. చాలా కాలం పాటు వీరు వార్తల్లో నిలుస్తూ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నారు.

ఇక కొన్ని రోజుల క్రితం నరేష్, పవిత్ర జంటగా మళ్లీ పెళ్లి అనే సినిమా ప్రకటించి పోస్టర్స్ , గ్లింప్స్ రిలీజ్ చేసి అందరికీ షాక్ ఇచ్చారు. అంతేకాదు ట్రైలర్స్ చూసిన వాళ్లంతా కూడా నరేష్ , పవిత్రల కథ ఇదని అనుకున్నారు. దీనిపై నరేష్ మాట్లాడుతూ.. ఈ సినిమా దర్శకులు ఎమ్మెస్ రాజు వయసులో పెద్ద అయినా.. ఆయన ఆలోచనలు యంగ్ గా ఉంటాయి. ఇటీవల ఆయన తీసిన డర్టీ హరీ సినిమానే మంచి ఉదాహరణ. మళ్లీ పెళ్లి కథ కూడా ఆయనదే. ఎప్పటినుంచో ఆయన నాతో సినిమా చేయాలనుకుంటున్నారు.. ఈ కథతో వచ్చినప్పుడు ఓకే చేసి మా బ్యానర్ లోనే చేస్తాను అన్నాను.

కృష్ణ గారు ఉన్నప్పుడు ఆయనకి కూడా కథ వినిపించాను.. బాగుంది.. చేయండి అన్నారు.. చాలామంది ట్రైలర్ చూసి నా జీవిత కథ అనుకుంటున్నారు.. కానీ కాదు ఇది అందరికీ కనెక్ట్ అయ్యే కదా.. ఒక వ్యక్తి పై రివెంజ్ తీర్చుకోవడానికి ఈ సినిమా తీశారు అంటున్నారు.. సినిమా తీసి రివెంజ్ తీర్చుకునే అంత డబ్బులు లేవు నాకు.. సినిమా చూసాక కూడా మీకు సందేహాలు ఉంటే నేనే సమాధానం ఇస్తాను అంటూ తెలిపారు. ఇక్కడ తెలుగులో నాకు పేరు ఉన్నట్టే.. పవిత్రకు కన్నడలో మంచి పేరు ఉంది.. అందుకే ఈ రెండు భాషల్లో రిలీజ్ చేయాలనుకున్నాము. టీజర్ తర్వాత వచ్చిన స్పందన చూసి తమిళ్, మలయాళం, హిందీ భాషల్లో కూడా సినిమాను రిలీజ్ చేయబోతున్నాము.. ఈ సినిమాకి సీక్వెల్ కూడా ఉంటుంది అంటూ ఆయన వెల్లడించారు

Read more RELATED
Recommended to you

Latest news