బండి సంజయ్ కి బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే బహిరంగ లేఖ

-

బండి సంజయ్ కి కూకట్ పల్లి బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే మాధవరం బహిరంగ లేఖ రాశారు. కూకట్ పల్లిలో ఐడీపీల్ సంస్థ కి 900 ఎకరాల భూమి కేంద్ర ప్రభుత్వం అధీనంలో ఉంది దాని నుండి 500 ఎకరాలు మాకు ఇవ్వండి ప్రతి అప్లికేషన్ దారుడికి మా ప్రభుత్వం నుండి కట్టి ఇస్తామని సవాల్‌ చేశారు ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు.

కూకట్ పల్లిలో బండి సంజయ్ డబుల్ బెడ్ రూంల పై చేసిన కామెంట్స్ కి కూకట్ పల్లి ఎమ్మెల్యే మాధవరం కౌంటర్ ఇచ్చారు. కేంద్ర ప్రభుత్వం స్వాధీనం లో ఉన్న భూములను అమ్ముకొంటు పోయేది బీజేపీనే .. లబ్ధి పొందేదుకు ప్రయత్నం చేసేది మీరేనని ఆగ్రహించారు. తెలంగాణ ప్రజలపై ప్రేమ అభిమానం ఉంటే కరీంనగర్ నుండి గెలిపించిన ప్రజలకు డబుల్ బెడ్ రూం లు ఇప్పించి హైదరాబాద్ నగరంలో మాట్లాడాలని చురకలు అంటించారు ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు.

హైదరాబాద్ నగరంలో కేంద్ర్రభుత్వా భూములు ఉన్నాయి.. మీ కేంద్ర ప్రభుత్వం నుండి తెచ్చి ఇవ్వండి… అప్పుడే ప్రజలు మీకు ఆశీర్వాదం ఇస్తారన్నారు. నోటికొచ్చిన మాటలు మాట్లాడటం మంచిది కాదు.. కేంద్రప్రభుత్వం నుండి తెలంగాణ కు వచ్చిన ఉద్యోగాలు చూపించండి..దొంగ దీక్షలు మానుకొని ప్రజలకు జవాబుదారీగా ఉండాలని పేర్కొన్నారు ఎమ్మెల్యే మాధవరం.

Read more RELATED
Recommended to you

Latest news