నా ఇష్టం..ఎవరికి ఓటేస్తే మీకేంటీ.. పవన్ అభిమానులపై రేణుదేశాయ్ ఫైర్..!

-

పవన్ మాజీ భార్య రేణు దేశాయ్ వర్సెస్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మధ్య కొన్నాళ్లు మాటల యుద్ధం నడించిన సంగతి తెలిసిందే. రేణు దేశాయ్ ఎంగేజ్మెంట్ తర్వాత పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఆమె పై చేసిన కామెంట్స్ కు రేణు దేశాయ్ ఫైర్ అవగా తర్వాత ఎలాగోలా ఆ ఇష్యూ క్లోజ్ అయ్యింది.

లేటెస్ట్ గా ఏపి ఎలక్షన్స్ టైంలో పవన్ అభిమానులు మళ్లీ రేణు దేశాయ్ మీద ఎటాక్ చేశారు. ఎలక్షన్స్ లో జనసేనకు ఓటు వేయాల్సిందిగా పవన్ కళ్యాణ్ కోరారు. జనసేనకు ఓటు వేయాలంటూ రేణు దేశాయ్ కు మెసేజ్ లు ఎక్కువవడం వల్ల ఆ కామెంట్స్ పై స్పందించింది. తన ఓటు హక్కు గురించి తనకి ఎవరు గుర్తు చేయవలసిన అవసరం లేదనీ తాను నివసిస్తున్న పూణేలో ఈనెల 23న ఎన్నికలు ఉన్నాయని.. ఇప్పుడు ఎలా ఓటు వేయగలనని అంటూ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ పై క్లాస్ పీకింగి రేణు దేశాయ్. ఓటు ప్రాధాన్యా గురించి ఓటు వేసుకుని ఇంక్ పెట్టుకున్న వేళ్లని చూపిస్తున్న వారి ఫోటోలు ట్యాగ్ చేయొద్దని పవన్ అభిమానులపై విరుచుకి పడ్డది రేణు దేశాయ్. తనకు నచ్చిన వ్యక్తికి తాను ఓటు వేస్తానని తన విషయాల గురించి కాకుండా జనసేన గురించి ఆలోచించుకోమని సలహా ఇచ్చింది రేణు దేశాయ్.

Read more RELATED
Recommended to you

Latest news