పార్లమెంట్‌ కొత్త భవనం ఆకారం శవపేటికలా ఉంది – ఆర్జేడీ

-

పార్లమెంట్‌ కొత్త భవనం ఆకారం శవపేటికలా ఉందని ఆర్జేడీ సంచలన వ్యాఖ్యలు చేశారు. దుమారం రేపుతున్న పార్లమెంట్‌ కొత్త భవనంపై ఆర్జేడీ ట్వీట్ చేసింది. పార్లమెంట్‌ నూతన భవనం ఆకారం శవపేటికలా ఉందని ఆర్జేడీ ట్వీట్‌ చేసింది.

అయితే, ఆర్జేడీ ట్వీట్‌పై అభ్యంతరం వ్యక్తం చేశారు అసదుద్దీన్‌ ఓవైసీ. పార్లమెంట్‌ భవనాన్ని శవపేటికతో పోల్చడం సరికాదని అసదుద్దీన్‌ వెల్లడించారు. ఇలా అనడం చాలా దారుణమన్నారు అసదుద్దీన్‌ ఓవైసీ. కాగా, ఇవాళ నూతన పార్లమెంట్ భవనాన్ని ప్రారంభించారు ప్రధాని మోడీ. ఇక ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రులు, ప్రముఖులు హాజరయ్యారు.

ఈ సందర్భంగా పార్లమెంట్ నిర్మాణంలో భాగస్వాములైన కార్మికులను సత్కరించారు ప్రధాని మోడీ. పార్లమెంట్ ప్రారంభోత్సవం సందర్భంగా సర్వ మత ధర్మ ప్రార్ధనలు నిర్వహించారు. సర్వ మత ధర్మ ప్రార్ధనల్లో ప్రధాని మోడీ, కేంద్ర మం త్రులు, ప్రముఖులు,వేద పండితులు పాల్గొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news