చంద్రబాబు వల్ల ఎన్టీఆర్ కు మూడుసార్లు గుండెపోటు – పోసాని

-

చంద్రబాబు వల్ల ఎన్టీఆర్ కు 3 సార్లు గుండె పోటు వచ్చిందని.. దేశంలో గుణం లేని ఏకైక వ్యక్తి చంద్రబాబు అని ఫైర్‌ అయ్యారు ఏపీఎఫ్సీ ఛైర్మన్, పోసాని కృష్ణమురళి. చంద్రబాబు చేతిలో చనిపోయిన వ్యక్తి ఎన్టీఆర్ అని.. ఏ కులం వారితో అయినా స్నేహం చేయవచ్చు… కానీ చంద్రబాబుతో చేయకూడదని కోరారు పోసాని కృష్ణమురళి.

దేశంలో గుణం లేని ఏకైక వ్యక్తి చంద్రబాబు అని.. దేశంలో ఏ దిక్కుకైనా వెళ్ళవచ్చు… కానీ దిక్కుమాలిన చంద్రబాబు వైపు వెళ్ళకండని ఎద్దేవా చేశారు పోసాని కృష్ణమురళి. చంద్రబాబు లక్ష్మీ పార్వతి వ్యక్తిత్వ హననం చేశాడని ఫైర్‌ అయ్యారు పోసాని కృష్ణమురళి. మూడు సార్లు గుండె పోటు వస్తే ఎన్టీఆర్ ను ప్రాణంలా చూసుకున్నారు లక్ష్మి పార్వతి.. ఎన్టీఆర్ తో పెళ్ళి తర్వాత లక్ష్మి పార్వతి పరిస్థితి పెనం మీద నుంచి పొయ్యిలో పడినట్లు అయిందని వెల్లడించారు పోసాని కృష్ణమురళి.

Read more RELATED
Recommended to you

Latest news