సుకుమార్ అల్లు అర్జున్ పుష్ప లో రోజా విలనిజం …!

-

లెక్కల మాస్టారు సుకుమార్ స్టైలిష్ స్టార్ అలు అర్జున్ ల కాంబినేషన్ లో రూపొందుతున్న హ్యాట్రిక్ సినిమా పుష్ప. ఆర్య .. ఆర్య 2 తర్వాత సుకుమార్ అల్లు అర్జున కాంబినేషన్ లో వస్తున్న ఈ సినిమా మీద ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేసినప్పటి నుంచే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక ఈ సినిమాని అయిదు భాషల్లో రిలీజ్ చేస్తున్నారు. ఈ విషయాన్ని ఫస్ట్ లుక్ రిలీజ్ చేసినప్పుడే చిత్ర యూనిట్ క్లారిటి ఇచ్చింది. అంతేకాదు తెలుగు కాకుండా మిగతా నాలుగు భాషల్లోను అల్లు అర్జున్ తన క్యారెక్టర్ కి తానే డబ్బింగ్ చెప్పుకోవాలని ప్రయత్నిస్తున్నాడు.

 

ఈ సినిమాలో కన్నడ బ్యూటీ రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తుండగా మరో హీరోయిన్ గా నిత్యా మీనన్ .. నివేదా థామస్ ల పేర్లు పరిశీలనలో ఉన్నాయి. ఎర్ర చందనం స్మగ్లింగ్ బ్యాగ్డ్రాప్ లో ఈ సినిమాని తెరకెక్కిస్తుండగా దేవీ ప్రసాద్ సంగీతమందిస్తున్నాడు. ఇప్పటికే మూడు పాటలని ఫైనల్ చేయగా ఈ సినిమాలో ఉన్న ఊర మాస్ పాటని కంపోజ్ చేసే పనిలో ఉన్నాడట దేవీశ్రీప్రసాద్. ఇక ఈ ఐటం సాంగ్ లో నర్తించడానికి బాలీవుడ్ హీరోయిన్ ఊర్వశి రౌతెలా అలాగే నోరా ఫతేహి లలో ఒకరు చేసే అవకాశం ఉందని తెలుస్తుంది.

 

ఇక ఈ సినిమాలో ఒక శక్తివంతమైన లేడీ విలన్ పాత్ర ఉందని యూనిట్ ముందు నుంచి అంటున్నారు. కాని ఆ పాత్ర లో ఎవరు నటిస్తారన్న క్లారిటి ఇవ్వలేదు. అయితే తాజా సమాచారం ప్రకారం సుకుమార్ ఆ క్యారెక్టర్ ని ఒకప్పటి స్టార్ హీరోయిన్ రోజా తో చేపించడానికి డైసైడయ్యాడ. ఇప్పటికే రోజా ని ఫైనల్ కూడా చేసుకున్నారని లాక్ డౌన్ తర్వాత ఆ పాత్రతో రోజా పుష్ప యూనిట్ లో జాయిన్ కానున్నారని సమాచారం. ఇక ఈ సినిమాని 2021 సమ్మర్ లో రిలీజ్ చేసే దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news