ట్రిపుల్ ఆర్ షూటింగ్ వాయిదా…?

-

ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ చెలరేగిపోతుంది. ఈ వైరస్ తీవ్రత రోజు రోజుకి భారీగా పెరిగిపోతుంది. చైనాలో తగ్గుముఖం పట్టిన ఈ వైరస్ ఇప్పుడు ఇతర దేశాలకు చుక్కలు చూపిస్తుంది. ఫ్రాన్స్, ఇటలీ దేశాల్లో కరోనా వైరస్ తీవ్రత చాలా ఎక్కువగా ఉంది. స్పెయిన్ లో కూడా కరోనా వైరస్ ప్రభావం ఎక్కువగా ఉంది. దీనితో ఇప్పుడు అన్ని దేశాలు కూడా కఠిన చర్యలు తీసుకుంటున్నాయి.

వైరస్ వ్యాప్తి దెబ్బ ఇప్పుడు సినిమాల మీద కూడా బాగానే పడుతుంది. సినిమాల విడుదలను వాయిదా వేయడమే కాకుండా, పలు సినిమాల షూటింగ్ ని కూడా వాయిదా వేసారు. తాజాగా రాజమౌళి దర్శకత్వంలో వస్తున్న ట్రిపుల్ ఆర్ సినిమాను కూడా వాయిదా వేసే సూచనలు కనపడుతున్నాయి. ట్రిపుల్ ఆర్ సినిమా ఇప్పుడు దాదాపుగా షూటింగ్ పూర్తి చేసుకునే దశకు వచ్చింది. కొన్ని సీన్ల కారణంగా ఆలస్యం అవుతూ వస్తుంది.

ఇక ఇప్పుడు ఈ సినిమాకు కరోనా దెబ్బ తగ్గిలే అవకాశాలు కనపడుతున్నాయి. కరోనా వైరస్ దెబ్బకు ఈ సినిమాలో నటించే విదేశీ నటులు తమ దేశాల నుంచి రావడం లేదు. దీనికి కారణం భారత ప్రభుత్వం వీసాలను రద్దు చేయడమే. అందుకే ఇప్పుడు ఈ సినిమా షూటింగ్ వాయిదా పడే అవకాశాలు ఉన్నాయని టాలీవుడ్ జనాలు అంటున్నారు. రాజమౌళి త్వరలోనే దీనిపై ఒక నిర్ణయం వెల్లడించే అవకాశం ఉందని అంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news