స్మిత షోలో సాయి పల్లవి ఎమోషనల్.. వీడియో వైరల్..!

-

సాయి పల్లవి గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. తమిళ్, మలయాళం, తెలుగు అంటూ పలు భాషలలో నటించి తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ను సొంతం చేసుకుంది. ప్రధాన్యత ఉన్న పాత్రలలో మాత్రమే నటిస్తూ తనకంటూ మంచి ఇమేజ్ సొంతం చేసుకున్న ఈమె ఎక్కువగా సమాజం గురించి పదిమందికి ప్రభావితం చేసే పాత్రలకి ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తుంది. అందుకే డిఫరెంట్ రోల్స్ చేస్తూ సక్సెస్ కూడా అందుకుంటుంది ఈ ముద్దుగుమ్మ..

సాయి పల్లవి చాలా సున్నిత మనస్కురాలు అని ఫ్యామిలీతోనే ఎక్కువ సమయం గడుపుతుంది అని చెప్పడంలో ఆలోచన లేదు. ఇటీవల తాజాగా సింగర్ స్మిత సోనీ లీవ్ లో నిజం విత్ స్మిత అనే టాక్ షో నిర్వహిస్తోంది . దానికి సాయి పల్లవి, రానా ముఖ్యఅతిథులుగా హాజరవడం జరిగింది. ఈ షో ఎపిసోడ్ కి సంబంధించి వీడియో ఒకటి రిలీజ్ చేయగా ప్రోమో లాంటి ఆ వీడియోలో సాయి పల్లవి ఎమోషనల్ అయినట్లు తెలుస్తోంది. ఇందులో అబ్యూజింగ్ గురించి మాట్లాడినట్లు తెలుస్తోంది..

సమాజంలో ఫిజికల్ అబ్యూజింగ్, వెర్బల్ అబ్యూజింగ్ అంటూ స్మిత తో మాట్లాడుతూ ఆమె భావోద్వేగానికి లోనయ్యారు ఇకపోతే సాయి పల్లవి ఎపిసోడ్ కోసం అభిమానులు చాలా ఎదురు చూస్తున్నట్లు తెలుస్తోంది. అందులో ఆమె ఏం మాట్లాడింది అని తెలుసుకోవడానికి ఆసక్తి చూపిస్తున్నట్లు సమాచారం.సమాజంలో ఇప్పటికే చాలామంది లైంగిక దాడులకు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. ఒక సామాన్య ప్రజలే కాదు సెలబ్రిటీలు కూడా ఇలాంటి దాడులకు గురి అవుతున్నారు. ఈ క్రమంలోనే సాయి పల్లవి వీటిని తలుచుకొని మరింత ఎమోషనల్ అయినట్లు మనకు వీడియో ద్వారా స్పష్టం అవుతోంది.

Read more RELATED
Recommended to you

Latest news