సెన్సార్ తో షాక్ ఇస్తున్న చిత్రలహరి..!

-

సాయి తేజ్ అదేనండి మెగా హీరో సాయి తేజ్ హీరోగా కిశోర్ తిరుమల డైరక్షన్ లో మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన సినిమా చిత్రలహరి. ఏప్రిల్ 12న రిలీజ్ ప్లాన్ చేసిన ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. సెన్సార్ నుండి చిత్రలహరి క్లీన్ యు సర్టిఫికెట్ అందుకోవడం విశేషం. మెగా హీరోగా ఎంట్రీ ఇచ్చిన రెండు మూడు సినిమాలకే మాస్ ఇమేజ్ సంపాదించి సుప్రీం హీరోగా స్క్రీన్ నేమ్ కూడా తెచ్చుకున్న సాయి తేజ్ సినిమా క్లీన్ ఎంటర్టైనర్ గా రావడం ఆశ్చర్యకరంగా ఉంది.

కిశోర్ ఇదవరకు తీసిన సినిమాల్లానే ఇది కూడా యూత్ ఫుల్ ఎంటర్టైనర్ గా ఉంటూనే ఫ్యామిలీ మొత్తం చూసే సినిమాగా తెరకెక్కించాడట. తేజూ సరసన కళ్యాణి ప్రియదర్శి, నివేదా పేతురాజ్ హీరోయిన్స్ గా నటించిన ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించడు. ఇప్పటికే రిలీజైన సాంగ్స్ సూపర్ హిట్ అవగా చిత్రలహరితో అయినా హిట్ ట్రాక్ ఎక్కాలని గట్టిగా ఫిక్స్ అయ్యాడు సాయి తేజ్. మరి ఫలితం ఎలా ఉంటుందో తెలుకోవాలంటే మరో 3 రోజులు వెయిట్ చేస్తే సరిపోతుంది.

Read more RELATED
Recommended to you

Latest news