జనసేన పార్టీకి 25 లక్షల విరాళం ప్రకటించిన హీరో నితిన్

-

సోమవారం రాత్రి భీమవరంలో నితిన్, ఆయన తండ్రి, నిర్మాత సుధాకర్ రెడ్డి పవన్ కల్యాణ్ ను కలిశారు. డీహైడ్రేషన్ తో పవన్ అస్వస్థతకు గురైన సంగతి తెలిసిందే కదా. ఈనేపథ్యంలో ఆయన్ను పరామర్శించి.. ఆరోగ్య వివరాలు అడిగి తెలుసుకున్నారు.

హీరో నితిన్, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ మధ్య ఎంత సాన్నిహిత్యం ఉంటుందో అందరికీ తెలిసిందే. నితిన్ ఫేవరేట్ హీరో కూడా పవన్ కల్యాణ్. అప్పుడప్పుడు తన సినిమా ప్రమోషనల్ కార్యక్రమాలకు నితిన్ పవన్ ను పిలుస్తుంటాడు. అయితే.. తాజాగా నితిన్ మళ్లీ పవన్ పై ఉన్న అభిమానానాన్ని చూపించాడు.

Hero nithin donates 25 lakhs to janasena party

జనసేన పార్టీ నిధికి 25 లక్షల రూపాయలను నితిన్ విరాళంగా ప్రకటించాడు. సోమవారం రాత్రి భీమవరంలో నితిన్, ఆయన తండ్రి, నిర్మాత సుధాకర్ రెడ్డి పవన్ కల్యాణ్ ను కలిశారు. డీహైడ్రేషన్ తో పవన్ అస్వస్థతకు గురైన సంగతి తెలిసిందే కదా. ఈనేపథ్యంలో ఆయన్ను పరామర్శించి.. ఆరోగ్య వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం జనసేన నిధికి 25 లక్షల రూపాయల విరాళాన్ని పవన్ కు అందించారు.

సోదరుడు నితిన్ నా ఆరోగ్యం గురించి వాకబు చేయడం చాలా సంతోషంగా ఉంది. ఎంతో అభిమానంగా జనసేనకు విరాళం ప్రకటించిన నితిన్ కు, సుధాకర్ రెడ్డికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని పవన్ వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Latest news