“మేజర్” సినిమా చూసి కన్నీళ్లు పెట్టుకున్న సందీప్ తల్లి

-

“మేజర్” సినిమా భారీ అంచనాల మధ్య ఎట్టకేలకు జూన్ 3న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ముంబై దాడుల్లో వీరమరణం పొందిన ఆర్మీ ఆఫీసర్ ‘సందీప్ ఉన్నికృష్ణన్’ జీవిత కథతో రూపొందిన చిత్రమిది.ఈ సినిమాని సూపర్ స్టార్ మహేష్ బాబు నిర్మించారు. శశికిరణ్ తిక్క దర్శకత్వం వహించిన ఈ మూవీలో సందీప్ ఉన్నికృష్ణన్ పాత్రలో యంగ్ హీరో అడవి శేష్ నటించిన విషయం తెలిసిందే. అయితే ఈ సినిమాను చూసిన రియల్ హీరో సందీప్ ఉన్నికృష్ణన్ తండ్రి కే. ఉన్నికృష్ణన్ తన అభిప్రాయం తెలిపారు.

“సందీప్ ఉన్నికృష్ణన్ జీవితాన్ని ప్రతిబింబించేలా చాలా బాగా చూపించారు. చాలా మంచి సినిమా తెరకెక్కించారు. చిత్ర బృందానికి మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలుపుతున్నాను. నేను హైదరాబాదులో ఉన్నందుకు చాలా గర్వపడుతున్నాను. హైదరాబాదుకు మళ్ళీ వస్తాను” అని సందీప్ తండ్రి కె. ఉన్నికృష్ణన్ పేర్కొన్నారు. కాగా మేజర్ సినిమా గురించి కే. ఉన్నికృష్ణన్ తన అభిప్రాయాన్ని చెబుతున్న సమయంలో ఆ మాటలు విని సందీప్ తల్లి ధనలక్ష్మి ఉన్నికృష్ణన్ కన్నీటిపర్యంతమయ్యారు.

Read more RELATED
Recommended to you

Latest news