అమిత్ షా పై మంత్రి ప్రశాంత్ రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు

-

అమిత్ షా పై మంత్రి ప్రశాంత్ రెడ్డి ఫైర్ అయ్యారు. అవతరణ దినోత్సవం లో అల్లూరి సీత రామరాజు ను తెలంగాణ ఉద్యమ కారునిగా కొలిచారని.. బీజేపీ నేతలు తెలంగాణ పై ఉన్న సోయి ఏంటో అర్థం అయిందని మండిపడ్డారు. అమిత్ షా చెప్పిన అబద్ధాలకు కిషన్ రెడ్డి బసవన్న లా తలూపారని.. ఆవిర్భావ వేడుకల్లో పచ్చి అబద్దాలు మాట్లాడారని పేర్కొన్నారు.

కేంద్రం రాష్ట్రానికి ఇచ్చిన నిధుల పై కేటీఆర్ సవాల్ కు ఇప్పటి వరకు ఎవరు స్పందించలేదని.. కేంద్రం నుండి 3 లక్షల 65 వేళా కోట్లు ఇవ్వాల్సి ఉంక్సగా లక్ష 65 కోట్లు మాత్రమే ఇచ్చారన్నారు. కానీ అమిత్ షా 2 లక్షల 52 వేలా కోట్లు ఇచ్చారు అని అబద్దాలు మాట్లాడారు…వీటిలో సిగ్గు లేకుండా ముద్ర లోన్లు , ఈఎస్ఐ , మెట్రో ఇచ్చిన నిధులను కూడా వీటిలో కలిపి చెప్పుకుంటున్నారన్నారు.

కేంద్రం తో బాగుంటే మరో లక్ష కోట్లు వచ్చేవి అని అమిత్ షా అన్నారు.. అంటే కోట్లు ఎగ్గొట్టారని చెప్పినట్లే కదా ? అని నిలదీశారు. దమ్ముంటే కిషన్ రెడ్డి , బండి సంజయ్ లు రాష్ట్రానికి రావాల్సిన లక్ష కోట్లు తీసుకురావాలని సవాల్ విసిరారు.

Read more RELATED
Recommended to you

Latest news