‘సరిలేరు నీకెవ్వరు’ యూనిట్ సరికొత్త స్ట్రాటజీ…..!!

-

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా రష్మిక మందన్న హీరోయిన్ గా జిఎంబి ఎంటర్టైన్మెంట్స్, ఏకే ఎంటర్టైన్మెంట్స్, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్స్ పై నిర్మితం అవుతున్న భారీ ప్రతిష్టాత్మక సినిమా సరిలేరు నీకెవ్వరు. మహేష్ బాబు తొలిసారి ఒక ఆర్మీ మేజర్ పాత్రలో నటిస్తున్న ఈ సినిమా ద్వారా లేడీ సూపర్ స్టార్ విజయశాంతి చాలా ఏళ్ళ తరువాత టాలీవుడ్ ఇండస్ట్రీకి నటిగా రీఎంట్రీ ఇవ్వడం జరుగుతోంది. రాజేంద్ర ప్రసాద్, మురళీశర్మ, సంగీత, బండ్ల గణేష్, శ్రీనివాస రెడ్డి, సుబ్బ రాజు, వెన్నెల కిషోర్, హరితేజ తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాకు దేవిశ్రీప్రసాద్ సంగీతాన్ని అందిస్తుండగా తమ్మిరాజు ఎడిటింగ్ ని మరియు రత్నవేలు ఫోటోగ్రఫిని అందించడం జరుగుతోంది.

ఇక ఇటీవల ఈ సినిమా అఫీషియల్ టీజర్ యూట్యూబ్ లో రిలీజ్ అయి ఆడియన్స్ నుండి అద్భుతమైన రెస్పాన్స్ ని సంపాదించడంతో పాటు సినిమాపై అంచనాలు కూడా విపరీతంగా పెంచేయడం జరిగింది. ఇక తమ సినిమా ప్రమోషన్స్ ని మరింతగా విస్తృతం చేయాలని భావించిన సరిలేరు మూవీ యూనిట్, నిన్న ఒక ప్రకటన ను రిలీజ్ చేసింది. ఇకపై ప్రతి సోమవారం ఈ సినిమా నుండి ఒక సర్ప్రైజ్ ఉంటుందని ఫ్యాన్స్ కు ఒక గుడ్ న్యూస్ చెప్పింది. అయితే అందుతున్న సమాచారాన్ని బట్టి,

 

రాబోయే సోమవారం నుండి ఈ డిసెంబర్ లో ఉండే మొత్తం ఐదు సోమవారాల్లో కూడా ఈ సినిమా నుండి ఒక్కొక్క సాంగ్ ని రిలీజ్ చేయబోతోందట సినిమా యూనిట్. ముందుగా రాబోయే సోమవారం నాడు ఈ సినిమా నుండి మహేష్, రష్మికల పై చిత్రీకరించిన ఒక రొమాంటిక్ సాంగ్ ని యూట్యూబ్ లో రిలీజ్ చేయబోతున్నారట. ఈ సాంగ్ కి దేవిశ్రీ సూపర్బ్ మ్యూజిక్ ఇచ్చాడని, అలానే దీనితో పాటు సినిమాలోని మిగతా సాంగ్స్ కూడా అదిరిపోనున్నాయని టాక్. కాగా ఈ న్యూస్ నిజంగా సూపర్ స్టార్ ఫ్యాన్స్ కి మంచి పండుగ న్యూస్ అని చెప్పవచ్చు. ప్రస్తుతం షూటింగ్ చివరి దశకు చేరుకున్న ఈ సినిమాను రాబోయే సంక్రాంతి కానుకగా జనవరి 11న రిలీజ్ చేయబోతున్నారు…..!!

Read more RELATED
Recommended to you

Latest news