మెగా ల్యాండ్ మార్క్ అనౌన్స్ మెంట్ తో థ్రిల్ చేసిన ‘సరిలేరు నీకెవ్వరు’ యూనిట్ …..!!

-

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వం లో తెరకెక్కుతున్న సినిమా సరిలేరు నీకెవ్వరు. జిఎంబి ఎంటర్టైన్మెంట్స్, ఏకే ఎంటర్టైన్మెంట్స్, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్లపై మహేష్, దిల్ రాజు, అనిల్ సుంకర కలిసి ఎంతో భారీ ఎత్తున నిర్మిస్తున్న ఈ సినిమాలో మహేష్ సరసన రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తుండగా, సీనియర్ హీరోయిన్ విజయశాంతి గారు, చాలా గ్యాప్ తరువాత ఈ సినిమా ద్వారా టాలీవుడ్ కి నటిగా రీఎంట్రీ ఇస్తున్నారు.

ఇటీవల ఈ సినిమా నుండి రిలీజ్ అయిన సాంగ్స్ కు ఒకింత మిశ్రమ స్పందన లభించినప్పటికీ, టీజర్ మాత్రం అద్భుతంగా అదరగొట్టి సినిమాపై అమాంతం అంచనాలు పెంచేయడం జరిగింది. ఇకపోతే ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుక వచ్చే నెల 5వ తేదీన హైదరాబాద్ లోని లాల్ బహదూర్ స్టేడియంలో ఎంతో గ్రాండ్ గా జరగనుండగా, ఈ వేడుకకు మెగాస్టార్ చిరంజీవి ప్రత్యేక అతిథిగా విచ్చేయబోతున్నట్లు సినిమా యూనిట్ కాసేపటి క్రితం ఒక అధికారిక ప్రకటనను రిలీజ్ చేసింది. గతంలో మహేష్ టక్కరిదొంగ సినిమా ఓపెనింగ్ కి అలానే, నిజం సినిమా ఆడియో ఫంక్షన్ కి ప్రత్యేకంగా విచ్చేసిన మెగాస్టార్,

 

చాలా ఏళ్ళ గ్యాప్ తరువాత ఈ మెగా ఈవెంట్ కి విచ్చేయడంతో ఈ వేడుకకు మరింత ప్రత్యేకత చేకూరనుంది. అనిల్ సుంకర, దిల్ రాజు, దర్శకుడు అనిల్ రావిపూడి ప్రత్యేకంగా మెగాస్టార్ ఇంటికి వెళ్లి ఆయనను తమ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ఆహ్వానించారు. ఆ ఫోటోలు ప్రస్తుతం పలు సోషల్ మీడియా మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి. ఇక మహేష్ బాబు కూడా చిరంజీవి గారు మా సినిమా వేడుకకు వస్తున్నందుకు ఎంతో సంతోషంగా ఉందని, ఈ వేడుకకు వస్తున్న చిరంజీవి గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెప్పిన మహేష్, ఆయనతో కలిసి ఫంక్షన్ లో సందడి చేయడానికి తాను ఎంతో ఉత్సాహంగా ఎదురుచూస్తున్నట్లు తన సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా ట్వీట్ చేయడం జరిగింది….!!

Read more RELATED
Recommended to you

Latest news