కొత్త రికార్డు సృష్టించ‌బోతున్న ‘సరిలేరు నీకెవ్వరు’ సాంగ్

-

సూపర్ స్టార్ మహేష్ బాబు.. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెర‌కెక్క‌బోతున్న సినిమా ‘సరిలేరు నీకెవ్వరు’. ఈ సినిమాలో మహేష్ బాబు.. ఫస్ట్ టైమ్ ఒక ఆర్మీ మేజర్ అజయ్ కృష్ణ పాత్రలో నటిస్తున్నాడు. ఈ సినిమాను సంక్రాంతి కానుకగా జనవరి 11న విడుదల చేయనున్నారు. అలాగే ఈ సినిమాలో ఫస్ట్ టైమ్.. మహేష్ బాబు సరసన రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తోంది. మరోవైపు ఒకప్పటి లేడీ సూపర్ స్టార్ విజయ్ శాంతి ఈ సినిమాతో నటిగా రీ ఎంట్రీ ఇస్తుంది.ప్ర‌స్తుతం ఈ సినిమాకు సంబంధించిన ప‌నులు శ‌ర‌వేగంగా జ‌రిగిపోతున్నాయి.

ఇక ఈ సినిమా నుంచి ప్రతి సోమవారం ఒక లిరికల్ సాంగును వదలనున్నట్టు ముందుగానే చెప్పారు. అలాగే నిన్న ఈ సినిమా నుంచి ‘సూర్యుడివో .. చంద్రుడివో’ పాటను వదిలారు. ప్రస్తుతం ఈ పాట యూట్యూబ్ లో ఒక రేంజ్ లో దూసుకుపోతోంది. దేవిశ్రీ ప్రసాద్ స్వరపరిచిన ఈ పాట 24 గంటలు గడవకముందే రెండున్నర మిలియన్ల వ్యూస్ కి చేరువైంది. గతంలో మహేశ్ పేరుతో వున్న యూ ట్యూబ్ రికార్డులను ఈ పాట అధిగమించేలానే ఉందని అంటున్నారు. కథాకథనాలపరంగానే కాకుండా, ఇతర విశేషాల పరంగా కూడా ఈ సినిమా అనేక ప్రత్యేకతలను కలిగి ఉండటంతో, అంతకంతకు అంచనాలు పెరిగిపోతున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news