ఇండస్ట్రీలో వివక్షత పై సంచలన వ్యాఖ్యలు చేసిన సీనియర్ హీరోయిన్..!!

-

ప్రముఖ సీనియర్ హీరోయిన్ జయసుధ గురించి మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక ఈమె సహజనటిగా గుర్తింపు తెచ్చుకొని సుమారుగా తెలుగు, తమిళ్, మలయాళం చిత్రాలలో..కొన్ని పదుల సంఖ్యలో సినిమాలలో నటించి మంచి ఇమేజ్ ని సొంతం చేసుకుంది . 50 సంవత్సరాలు సినీ జీవితాన్ని ఇటీవల పూర్తి చేస్తున్న నేపథ్యంలో మీడియాతో మాట్లాడుతూ ఇండస్ట్రీలో హీరో హీరోయిన్ల పై వివక్షత గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు జయసుధ . అంతేకాదు తెలుగు సినీ ఇండస్ట్రీకి, బాలీవుడ్ సినీ ఇండస్ట్రీకి గల తారతమ్యాన్ని కూడా ఆమె వెల్లడించడం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది.ఇకపోతే ఎన్టీఆర్, ఏఎన్ఆర్, శోభన్ బాబు వంటి మొదటి తరం హీరోలతో కలిసి నటించి ఆడి పాడిన ముద్దుగుమ్మ అనేక సంచలనాలకు అప్పట్లో కేరాఫ్ అడ్రస్ గా నిలిచారు. ఇకపోతే ప్రస్తుతం అడపా దడపా సినిమాలు చేస్తూ.. క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్రకే పరిమితం అయ్యారు.. మీడియాతో మాట్లాడుతూ స్టార్ హీరోయిన్గా ఉన్నప్పుడు.. ఇప్పుడు ఎప్పుడైనా హీరోలతో పోల్చుకుంటే హీరోయిన్లపై వివక్షత ఎక్కువగా ఉందని జయసుధ అన్నారు.ముఖ్యంగా ముంబై హీరోయిన్ అయితే బెటర్ అని.. బాంబే నుంచి హీరోయిన్ వస్తే ఆమె కుక్కలకి కూడా స్పెషల్ రూమ్ ఇస్తారు అని ఇండస్ట్రీపై అలాగే నిర్మాతలపై హాట్ కామెంట్ చేశారు జయసుధ.

ఇతర భాష హీరోయిన్లతో పోల్చుకుంటే తెలుగు హీరోయిన్ల పై ఎప్పటికీ చిన్న చూపే ఉందంటున్నారు. అదే సమయంలో పద్మశ్రీ లాంటి అవార్డులకు మేము పనికి రామా అంటూ ఆమె ఘాటుగా స్పందించడం జరిగింది. ఇకపోతే ఇటీవల కంగనా రనౌత్ కిపద్మశ్రీ పురస్కారం ఇచ్చిన నేపథ్యంలో ఆమె ప్రభుత్వానికి ఏం అవసరం ఉందో అంటూ సంచలనాలకు తెరలేపింది జయసుధ. ఇక ఎప్పటికీ కూడా సినీ ఇండస్ట్రీలో తెలుగు హీరోయిన్లను తొక్కేస్తున్నారు అంటూ జయసుధ బాధపడడం జరిగింది.

Read more RELATED
Recommended to you

Latest news