తాత… కొడుకు…తను… హరికృష్ణకిదేం శాపం.?

-

అప్పుడు హైదరాబాద్ కు సమీపంలోని శంషాబాద్ లో సీనియర్ ఎన్టీఆర్ కు ఉన్న పొలానికి వెళ్లి వస్తుండగా రాజేంద్రనగర్ దగ్గర జరిగిన రోడ్డు ప్రమాదంలో సీనియర్ ఎన్టీఆర్ తండ్రి లక్ష్మయ్య చౌదరి కన్నుమూశాడు. అప్పట్లో ఆయన రోడ్డు ప్రమాదంలో మరణించడం సీనియర్ ఎన్టీఆర్ మనసును తీవ్రంగా కలిచివేసింది. తన తండ్రిని మింగిన ఆ పొలం తనకు అక్కర్లేదని తండ్రి చనిపోయిన వెంటనే అక్కడ ఉన్న పొలాన్ని అమ్మేశాడట సీనియర్ ఎన్టీఆర్.

ఇప్పుడు అదే సీన్ మళ్లీ రిపీట్ అయింది.. జూనియర్ ఎన్టీఆర్ అన్న జానకీరామ్, తండ్రి హరికృష్ణ కూడా రోడ్డు ప్రమాదంలోనే మృతిచెందారు. అయితే.. రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన తాత లక్ష్మయ్య చౌదరికి, మనవడు హరికృష్ణకు విడదీయలేని బంధం ఉండేది. తాతకు ఇష్టమైన మనవడు హరికృష్ణ. ఇలా.. తాతకు ఇష్టమైన మనవడు, తాత, ఆ మనవడి కొడుకు ముగ్గురు రోడ్డు ప్రమాదంలోనే మృతి చెందడం నందమూరి ఫ్యామిలీని తెగ వేదిస్తున్నది. జస్ట్ మిస్ లో జూనియర్ ఎన్టీఆర్ కూడా రోడ్డు ప్రమాదంలో చావును తప్పించుకున్నాడు. నందమూరి ఫ్యామిలీలో ఈ రోడ్డు ప్రమాదాలు అంతులేని శోకాన్ని మిగిల్చుతున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news