నెట్‌ప్లిక్స్ కోసం శృతిహాస‌న్ ప్ర‌యోగం!

-

క‌రోనా వైర‌స్ కార‌ణంగా థియేట‌ర్లు రీ ఓపెన్ అయ్యే ప‌రిస్థితులు క‌నిపించ‌డం లేదు. ఒక వేళ కేంద్రం అనుమ‌తులిచ్చినా థియేట‌ర్ల‌కి రావ‌డానికి ప్రేక్ష‌కులు ఆస‌క్తిని చూపించే ప‌రిస్థితులు కూడా అంతంత మాత్ర‌మే.. థియేట‌ర్స్ తెన‌వాలంటే కేంద్రం ప్ర‌తీ షోకి షానిటైజేష‌న్ చేయాల‌నే నిబంధ‌న పెట్ట‌బోతోంది. దీన్ని భ‌రించి థియేట‌ర్లు తెర‌వ‌డం కంటే మూయ‌డ‌మే బెట‌ర్ అని ఎగ్జిబిట‌ర్స్‌.. ఆఖ‌ర్చును త‌మ మీదే రుద్దేస్తార‌ని నిర్మాత‌లు చెబుతున్నారు.

ప్ర‌స్తుతం ప‌రిస్థితుల్లో న‌టీన‌టుల‌కు సేఫ్ ప్లాట్ ఫామ్‌గా మారాయి ఓటీటీ ప్లాట్ ఫామ్స్‌. ఇటీవ‌ల క్రేజీ చిత్రాల‌న్ని కూడా ఓటీటీ బాట‌ప‌డుతుండ‌టంతో ఓటీటీ ప్లాట్ ఫామ్‌ల కోసం చిత్రీక‌రించే వెబ్ సిరీస్‌ల‌పై క్రేజీ తార‌లు ఆస‌క్తిని చూపిస్తున్నారు. అందుకు ద‌ర్శ‌కులు కూడా ముందుకు రావ‌డంతో ప్ర‌యోగాలు చేయ‌డానికి సిద్ధ‌మ‌వుతున్నారు. తాజాగా క్రేజీ హీరోయిన్‌ శృతిహాస‌న్ నెట్ ఫ్లిక్స్ కోసం ఓ ప్ర‌యోగాత్మ‌క వెబ్ ఫిల్మ్‌లో న‌టించ‌డానికి అంగీక‌రించిన‌ట్టు తెలిసింది.

`మ‌హాన‌టి` ఫేమ్ నాగ్ అశ్విన్ ఈ వెబ్ ఫిల్మ్‌ని డైరెక్ట్ చేస్తున్నార‌ట‌. సార‌థీ స్టూడియోస్‌లో దీనికి సంబంధించిన షూటింగ్ జ‌రుగుతోంది. ప్ర‌త్యేకంగా వేసిన సెట్లో షూట్ చేస్తున్నారు. ఈ వెబ్ ఫిల్మ్ నిడివి 30 నుంచి 45 నిమిషాలు మాత్ర‌మే వుంటుంద‌ని, ప్ర‌యోగాత్మ‌కంగా దీన్ని నెట్ ఫ్లిక్స్ కోసం షూట్ చేస్తున్నార‌ని తెలిసింది.

Read more RELATED
Recommended to you

Latest news