మెగా ఫ్యామిలీకి లక్కీ హీరోయిన్గా మారిన శృతిహాసన్.. వస్తే హిట్ పక్కా.!

-

సినీ వారసత్వంతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టినప్పటికీ.. కూడా తనదైన నటనతో ప్రేక్షకులను మెప్పించి స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది శృతిహాసన్.  ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ జోష్ మీద ఉన్న ఈ ముద్దుగుమ్మ బడా హీరోల సరసన సీనియర్ హీరోల సరసన నటిస్తూ దూసుకుపోతోంది. చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య సినిమాతో పాటు బాలకృష్ణ నటించిన వీర సింహారెడ్డి సినిమాలో కూడా ఈమె హీరోయిన్గా నటించి భారీ సక్సెస్ ను సొంతం చేసుకుంది. రెండు సినిమాలు కూడా మంచి విజయం అవడంతో ఈమెకు భారీ పాపులారిటీ దక్కిందని చెప్పవచ్చు. ఈ క్రమంలోనే మరోపక్క డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా వస్తున్న సలార్ సినిమాలో కూడా అవకాశాన్ని దక్కించుకుంది.
ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ సెరవేగంగా జరుగుతుండగా.. ఇప్పుడేమో శృతిహాసన్ ను మెగా అభిమానులు తెగ పొగిడేస్తున్నారు.  అంతేకాదు గోల్డెన్ హ్యాండ్ అంటూ కూడా ఆమెపై ప్రశంసల వర్షం కురిపిస్తూ ఉండడం గమనార్హం. శృతిహాసన్ మెగా ఫ్యామిలీ హీరోలకు లక్కీ హీరోయిన్ గా మారిపోయింది. మెగా హీరోలతో చేసిన ప్రతి సినిమా కూడా మంచి సక్సెస్ పొందడంతో మెగా హీరోలకు లక్కీ హీరోయిన్గా మారిపోయింది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో  గబ్బర్ సింగ్ సినిమాలో నటించి భారీ విజయాన్ని సొంతం చేసుకున్న ఈమె ఆ తర్వాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో కలిసి ఎవడు సినిమాలో నటించి మరో సూపర్ హిట్ విజయాన్ని అందుకుంది.
అలాగే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించిన రేసుగుర్రం సినిమాలో కూడా ఈమె నటించింది. ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య లో కూడా ఈమె నటించింది. మొత్తానికి శృతిహాసన్ మెగా ఫ్యామిలీ హీరోలకు లక్కీ హ్యాండ్ గా మారిపోయింది అని చెప్పడంలో సందేహం లేదు ముఖ్యంగా ఈమె వాళ్లతో నటించింది అంటే ఆ సినిమాలు పక్కా బ్లాక్ బాస్టర్ అని చెప్పవచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news