రైతులకు అదిరిపోయే శుభవార్త.. ఈ నెల 23వ తేదీన కిసాన్ సమ్మాన్ నిధులు

-

రైతులకు అదిరిపోయే శుభవార్త చెప్పింది కేంద్ర సర్కార్‌. ఈ నెల 23వ తేదీన కిసాన్ సమ్మాన్ నిధులు విడుదల కానున్నాయి. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన 13వ విడత డబ్బులు ఈ నెలాఖరులో విడుదల చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

జనవరి 23న నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి ఉండటంతో ఆ రోజు రైతుల ఖాతాల్లో రూ.2000 చొప్పున వేస్తారని సమాచారం. మరోవైపు రైతులు ఈనెల 15లోగా ఈకేవైసీ పూర్తి చేయాలని, ఆధార్ అనుసంధానం చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. ఈకేవైసీ లేకుంటే 13వ విడత డబ్బులు రావని హెచ్చరిస్తున్నారు.

 

Read more RELATED
Recommended to you

Latest news