వారాహికి విజయవాడలో ప్రత్యేక పూజలు..పవన్‌ ఫోటోలు వైరల్‌

-

జనసేన అధినేత పవన్ కల్యాణ్ బుధవారం విజయవాడ కనకదుర్గ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. జనసేన ప్రచార రథానికి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం పార్టీ ప్రచార రథంపై నుంచి జనసేనాని తొలిసారి మాట్లాడారు.

రాక్షస పాలన నుంచి రాష్ట్రాన్ని విడిపించడమే జనసేన ప్రచార రథం వారాహి లక్ష్యమని జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ సుభిక్షంగా ఉండాలని, అభివృద్ధిలో తెలుగు రాష్ట్రాలు ముందుండాలని తాను కోరుకుంటానని చెప్పారు.

అమ్మవారిని దర్శించుకోవడం ఆనందంగా ఉందన్నారు. అమ్మవారి చల్లని చూపు రాష్ట్ర ప్రజలపై ఉంటుందన్నారు. ప్రచార రథానికి పూజ చేసేందుకు ఇంద్రకీలాద్రికి వచ్చానని పవన్ చెప్పారు.అయితే, ఇక్కడి పవన్‌ ఫోటోలు వైరల్‌ అయ్యాయి.

Read more RELATED
Recommended to you

Latest news