శ్రీకాంత్ అడ్డాల ‘కూచిపూడి వారి వీధి’

-

కొత్త బంగారు లోకం సినిమాతో దర్శకుడిగా పరిచయమైన శ్రీకాంత్ అడ్డాల సూపర్ స్టార్ మహేష్, విక్టరీ వెంకటేష్ లతో సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు లాంటి మల్టీస్టారర్ సినిమా చేసి హిట్ అందుకున్నాడు. అయితే ఆ సినిమా తర్వాత మహేష్ తో బ్రహ్మోత్సవం సినిమా చేసి డిజాస్టర్ చవిచూసిన శ్రీకాంత్ అడ్డాల కొన్నాళ్లు గ్యాప్ తీసుకున్నాడు. ఇక ప్రస్తుతం గీతా ఆర్ట్స్ బ్యానర్ లో సినిమా ఉంటుందని తెలుస్తుండగా ఆ సినిమా త్వరలో ప్రకటించనున్నారట.

ఇప్పటికే కథ ఓకే అవగా ఆ సినిమాకు హీరోని వెతికే పనిలో ఉన్నారట దర్శక నిర్మాతలు. ఇక తెలుస్తున్న సమాచారం ప్రకారం ఈ మూవీకి కూచిపూడివారి వీధి అని టైటిల్ పెట్టబోతున్నారట. మెగా హీరో సాయి ధరం తేజ్ ఈ సినిమాలో హీరోగా నటించే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతం సాయి ధరం తేజ్ కిశోర్ తిరుమల డైరక్షన్ లో చిత్రలహరి సినిమా చేస్తున్నాడు. ఆ సినిమా తర్వాత శ్రీకాంత్ అడ్డాల సినిమా ఉంటుందని తెలుస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news