ప్రభాస్ తో మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇవ్వని స్టార్ హీరోయిన్.. కారణం..?

-

రెబల్ స్టార్ ప్రభాస్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ప్రస్తుతం గ్లోబల్ స్టార్ గా దూసుకుపోతున్న ఈయన.. బాహుబలి సినిమాతో పాన్ ఇండియా స్థాయిని సొంతం చేసుకున్నాడు. ఇక ఇప్పుడు వరుస సినిమాలు చేస్తూ సూపర్ హిట్ గా దూసుకుపోతున్న ఈయన తాజాగా ఆది పురుష్ సినిమా టీజర్, ట్రైలర్ ప్రేక్షకులను మరింతగా ఆకట్టుకుంటున్నాయి. అంతేకాదు గ్లోబల్ వైడ్ గా రిలీజ్ అయిన ఈ ట్రైలర్ ఇప్పుడు రెబల్ స్టార్ స్థాయిని మరింత పెంచిందని చెప్పాలి.

ఇంతటి స్టార్ స్టేటస్ సొంతం చేసుకున్న ప్రభాస్ తో సినిమా అంటే కాజల్ భయపడిపోతుందట. నేను అతనితో సినిమా చెయ్యను అని దర్శక నిర్మాతలతో నిర్మొహమాటంగా చెప్పేస్తోందట. ప్రభాస్ ప్రస్తుతం ప్రశాంత్ నీల్ తో సలార్ అనే సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో హీరోయిన్గా శృతిహాసన్ నటిస్తోంది. ఈ సినిమా అనుకున్నప్పుడు ఆ పాత్రకు కాజల్ అగర్వాల్ సరిగ్గా సరిపోతుందని ఆమెనే సంప్రదించాడట ప్రశాంత్ నీల్. కానీ అప్పుడు కాజల్ మాత్రం ఈ పెద్ద ప్రాజెక్టులో నటించడానికి నాకు ఏమాత్రం ఇష్టం లేదు. ముఖ్యంగా ప్రభాస్తో నటించను అంటూ నిర్మొహమాటంగా చెప్పేసిందట.

దీంతో వీళ్లిద్దరి మధ్య ఎప్పటినుంచో గొడవలు ఉన్నాయన్న వార్తలు వస్తున్న నేపథ్యంలో వీటికి మరింత బలం చేకూరింది. వాస్తవానికి వీళ్ళిద్దరూ డార్లింగ్, మిస్టర్ పర్ఫెక్ట్ సినిమాలో నటించారు. రెండు కూడా మంచి విజయాన్ని అందుకున్నాయి. అందరూ వీరిద్దరిది క్యూట్ జంట అని కూడా అన్నారు. అంతేకాదు ప్రభాస్ మరియు కాజల్ ఇద్దరు ప్రేమించుకున్నారని ఎందుకో ప్రభాస్ చివరి నిమిషంలో బ్రేకప్ చెప్పాడని, అప్పటినుంచి అతనంటే కాజల్ కి ఇష్టం లేదని ఫిలింనగర్లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఏది ఏమైనా పర్సనల్ ఇష్యూస్ వల్ల ఒక గొప్ప ప్రాజెక్టును కాజల్ అగర్వాల్ వదులుకున్నారని చెప్పవచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news