రానా గుణశేఖర్ ల హిరణ్య కశిప ని ఆపేసిన సురేష్ బాబు ..ఎన్ని కోట్లు నష్టమో తెలుసా..?

-

ప్రస్తుతం రానా విరాట పర్వం అన్న సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాకి వేణు ఉడుగుల దర్శకత్వం వహిస్తున్నాడు. సాయి పల్లవి, ప్రియమణి హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఇక చాలా కాలం తర్వాత మళ్ళీ ప్రియమణి సెకండ్ ఇన్నింగ్స్ తో ఒకేసారి బాబాయ్, అబ్బాయ్ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వస్తుంది. అంతేకాదు విరాట పర్వం లో సాయి పల్లవి, ప్రియమణి నక్సల్స్ గా నటిస్తున్నారు. అందుకోసం ప్రియమణి కొద్ది రోజులు మాజీ నక్సలైట్ దగ్గర శిక్షణ తీసుకుందని సమాచారం.

 

ఇక ఈ సినిమా తో పాటు రానా అరణ్య అన్న సినిమాలో కూడా నటిస్తున్నాడు. తెలుగు తో పాటు మరో రెండు భాషల్లోను ఈ సినిమా రిలీజ్ కాబోతుంది. అయితే బాహుబలి సినిమా కంటే అరణ్య కోసమే ఎక్కువగా కష్ట పడ్డానని రానా రీసెంట్ గా వెల్లడించాడు. అడవి మనిషి తరహాలో ఉన్న రానా మేకోవర్ సినిమా మీద ఆసక్తిని పెంచుతోంది.

ఇక ఈ సినిమా తర్వాత రానా చేయాల్సిన భారీ ప్రాజెక్ట్ హిరణ కశిప. గుణ శేఖర్ దర్శకత్వంలో రూపొందించాలనుకున్న ఈ సినిమాకి గత సంవత్సర కాలంగా ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. భారీ కాన్వాయిస్ తో 120 కోట్ల భారీ బడ్జెట్ ఈ సినిమాని నిర్మించాలని ప్లాన్ చేశారు. అయితే తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాని నిలిపి వేస్తున్నట్టు గుణశేఖర్ కి సురేష్ బాబు తెలిపాడట. 2022 వరకు కరోనా ఎఫెక్ట్ ఉంటుందని ఆ తర్వాతే థియోటర్స్ సాధారణ షితికి వస్తాయని అప్పుడే ఈ ప్రాజెక్ట్ ని తిరిగి మొదలు పెడదాని చెప్పెశాడట. ఇక ఇప్పటి వరకు ఈ సినిమాకి 10 కోట్ల వరకు సురేష్ బాబు ఖర్చు చేసినట్టు తెలుస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news