భగ్గుమ‌న్న సుశాంత్ ఫ్యాన్స్‌.. స‌ల్మాన్‌ఖాన్‌, క‌ర‌న్ జోహార్‌ల దిష్టి‌బొమ్మ‌లు ద‌గ్ధం..

-

న‌టుడు సుశాంత్ సింగ్ రాజ్‌పూత్ ఆత్మ‌హ‌త్య‌పై అత‌ని ఫ్యాన్స్ తీవ్రంగా విచారం వ్య‌క్తం చేస్తున్నారు. చాలా మంది అత‌ని మృతిపై బాధ‌ప‌డుతున్నారు. ఇక అత‌ని ఆత్మ‌హ‌త్య‌కు కార‌ణ‌మ‌య్యారంటూ.. ప‌లువురు బాలీవుడ్ సెల‌బ్రిటీల‌ను వారు సోష‌ల్ మీడియాలో పెద్ద ఎత్తున అన్‌ఫాలో చేస్తున్నారు. తీవ్ర‌మైన విమ‌ర్శ‌ల‌తో వారిని ఫ్యాన్స్ చెడుగుడు ఆడుకుంటున్నారు. కాగా సుశాంత్ ఆత్మ‌హ‌త్య‌కు స‌ల్మాన్‌ఖాన్‌, క‌ర‌న్ జోహార్ స‌హా ప‌లువురు బాలీవుడ్ సెల‌బ్రిటీలు కార‌ణ‌మ‌ని ఆరోపిస్తూ ఓ లాయర్ బీహార్‌లో కేసు పెట్ట‌డం ఇప్పుడు సంచ‌ల‌నంగా మారింది. దీంతో సుశాంత్ ఫ్యాన్స్ ఒక్క‌సారిగా భ‌గ్గుమ‌న్నారు.

sushant fans burnt effigies of salman khan and karan johar

బీహార్‌లోని పాట్నాలో సుశాంత్ ఫ్యాన్స్.. స‌ల్మాన్ ఖాన్‌, క‌ర‌న్ జోహార్‌ల దిష్టి బొమ్మ‌ల‌ను ద‌గ్ధం చేశారు. సుశాంత్ ఆత్మ‌హ‌త్య‌కు క‌ర‌న్ జోహార్‌, స‌ల్మాన్ ఖాన్‌, ఆలియా భ‌ట్‌, సోన‌మ్ క‌పూర్‌లు కార‌ణ‌మంటూ వారు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ర‌హ‌దారుల‌పై ర్యాలీగా త‌ర‌లివెళ్లి వారి దిష్టి బొమ్మ‌ల‌ను ద‌హ‌నం చేశారు. వెంట‌నే ఆ సెల‌బ్రిటీల‌ను అరెస్టు చేసి శిక్షించాల‌ని వారు డిమాండ్ చేశారు.

కాగా సుశాంగ్ సింగ్ ఆత్మ‌హ‌త్య‌కు తీవ్ర‌మైన డిప్రెష‌నే కార‌ణ‌మ‌ని పోస్టుమార్టం నివేదిక‌లో వెల్ల‌డైన సంగ‌తి తెలిసిందే. దీంతో అత‌ని ఫ్యాన్స్ తీవ్ర‌మైన ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. ఈ క్ర‌మంలో ప్ర‌స్తుతం ఇలా ప‌లువురు సెల‌బ్రిటీల‌పై ఓ లాయ‌ర్ ఫిర్యాదు చేయ‌డం, మ‌రోవైపు ఫ్యాన్స్ ఆ సెల‌బ్రిటీల దిష్టిబొమ్మ‌ల‌ను ద‌హ‌నం చేయ‌డం.. ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి.

Read more RELATED
Recommended to you

Latest news