నా కొడుక్కి రియా విషం ఇచ్చింది…!

-

రియా చక్రవర్తి తన కొడుకుకి విషం ఇచ్చింది అని, ఆమెను అరెస్ట్ చేయాలని సుశాంత్ సింగ్ తండ్రి కృష్ణ కిషోర్ సింగ్ ఆరోపించారు. రియా తన కొడుకుని హత్య చేసిన హంతకురాలు అని ఆమెపై విమర్శలు చేసారు. ఆమె అతనికి డ్రగ్స్ ఇచ్చేది మరియు అరెస్టు చేయాలి అని ఆయన ఆరోపణలు చేసారు. రియా చాలా కాలంగా సుశాంత్ కు విషం ఇస్తున్నట్లు మీడియాకు చెప్పారు.

రియా చక్రవర్తి, ఆమె సోదరుడు షోయిక్ చక్రవర్తి మరియు ఇతరులపై నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్‌సిబి) ఎన్‌డిపిఎస్ (నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్‌స్టాన్సెస్) చట్టంలోని 20, 22, 27, 29 సెక్షన్ల కింద ఢిల్లీలో కేసులు నమోదు చేసారు. సుశాంత్ జీవితం గురించి మాట్లాడిన రియా అతను స్టార్ లా బ్రతికాడు అని అలాగే బ్రతకాలని అనుకున్నాడు అని ఒక ఇంటర్వులో చెప్పింది.

Read more RELATED
Recommended to you

Latest news