సూపర్ స్టార్ కృష్ణ మరణ వార్తను తెలుగు ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారు – మంత్రి రోజా

-

సూపర్ స్టార్ ఘట్టమనేని కృష్ణ మరణం పట్ల సినీ నటి, మంత్రి రోజా విచారం వ్యక్తం చేశారు. సూపర్ స్టార్ కృష్ణ మరణించారనే వార్తను తెలుగు ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారని అన్నారు. దిగ్గజాలైన ఎన్టీఆర్, ఏఎన్ఆర్, కృష్ణంరాజు.. ఇప్పుడు కృష్ణ కూడా మరణించడం తెలుగు సినీ రంగానికి తీరని లోటని అన్నారు మంత్రి రోజా. కృష్ణ ఎంతో సీనియర్ అయినా.. ఆయనకి ఇగో ఉండేది కాదని తెలిపారు.

 

మహేష్ బాబుకు దేవుడు ఎందుకు ఇంత కష్టం ఇచ్చాడో అని వ్యాఖ్యానించారు. వారి కుటుంబానికి భగవంతుడు ధైర్యం ఇవ్వాలని మంత్రి రోజా ఆకాంక్షించారు. కాగా సూపర్ స్టార్ కృష్ణ భౌతికకాయానికి సినీ ప్రముఖుల నివాళి అర్పిస్తున్నారు. పవన్ కళ్యాణ్, రాఘవేంద్రరావు, వెంకటేష్, జూనియర్ ఎన్టీఆర్, అడవి శేష్, రాజేంద్రప్రసాద్ తదితరులు కృష్ణ పార్టీవదేహానికి నివాళి అర్పించారు. అక్కడే ఉన్న మహేష్ బాబు ను ఆలింగనం చేసుకొని ధైర్యం చెప్పారు.

Read more RELATED
Recommended to you

Latest news