ధ్రువ-2 అక్కడ మొదలైంది.. మరి ఇక్కడ..!

-

మెగా పవర్ స్టార్ రాం చరణ్ కెరియర్ లో ధ్రువ సినిమా సక్సెస్ ఎంత ఇంపార్టెంటో అందరికి తెలుసు. సురేందర్ రెడ్డి డైరక్షన్ లో వచ్చిన ఆ సినిమా తమిళ సినిమా తని ఒరువన్ కు అఫిషియల్ రీమేక్ గా వచ్చింది. కోలీవుడ్ లో విలన్ గా నటించిన అరవింద స్వామి తెలుగులో కూడా నటించి మెప్పించారు. అక్కడ ఎంత పెద్ద విజయాన్ని అందుకుందో తెలుగులో కూడా ఆ సినిమా చరణ్ సత్తా చాటేలా విజయాన్ని నమోదు చేసుకుంది.

ఇక ఈ సినిమా మాత్రుక అదేనండి తని ఒరువన్ సినిమా సీక్వల్ ప్లానింగ్ లో ఉన్నాడు జయం రవి. తన సోదరుడు మోహన్ రాజా ఈ సినిమా సీక్వల్ ప్రయత్నాల్లో ఉన్నాడు. త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లబోతున్న ఈ సినిమాలో మళ్లీ సేం కాంబినేషన్ రిపీట్ అవబోతుందని తెలుస్తుంది.

మరి అక్కడ సీక్వల్ మొదలైంది అంటే ధ్రువ-2 గా ఆ సినిమా ఇక్కడ కూడా రీమేక్ చేస్తారా లేక అదే సినిమాను డబ్ చేసి ఇక్కడ రిలీజ్ చేస్తారా అన్నది చూడాలి. అయితే ఒకవేళ రీమేక్ అయితే చరణ్ మాత్రం ఇప్పుడు అసలు ఖాళీగా లేడు.

Read more RELATED
Recommended to you

Latest news