అన్న‌కు చెప్పిన క‌థ‌తో త‌మ్ముడిని లైన్‌లో పెట్టిన డైరెక్ట‌ర్‌.. వారెవ‌రంటే?

-

ఇండ‌స్ట్రీలో ఒక‌రితో చేయాల్సిన క‌థ‌ను మ‌రో హీరోతో చేయ‌డం అనేది చాలా కామ‌న్‌. ఈ పంతాలో ఇప్ప‌టికే చాలామంది సినిమాలు తీసి హిట్లుకూడా కొట్టారు. దాంతో ఆసినిమా తాము ముందు చేసి ఉంటే బాగుండేద‌ని ఆ హీరోలు బాధ‌ప‌డ‌టం కూడా ప‌రిపాటి. ఇప్పుడు ఇదే కోవలో అన్న‌తో చేయాల్సిన క‌థ‌ను త‌మ్ముడితో చేస్తున్నాడో ఓ స‌క్సెస్‌ఫుల్ డైరెక్ట‌ర్‌.

వెంకి కుడుముల తీసిన‌వి రెండు సినిమాలే అయినా మంచి హిట్ కొట్టాడు ఆరెండింటితో. నాగశౌర్యతో తీసిన ఛ‌లో సినిమా బంప‌ర్ హిట్ కొట్టింది. అలాగే నితిన్‌తో తీసిన భీష్మ మూవీ కూడా మంచి స‌క్సెస్ సాధించింది. అయితే ఈ రెండు సినిమాల్లో ర‌ష్మిక మండ‌న్న‌నే హీరోయిన్‌గా చేసింది.

ఇక ఇప్పుడు రామ్‌చ‌ర‌ణ్‌తో ఓ సినిమా చేసేందుకు వెంకీ ప్లాన్ చేయ‌గా.. ఈయ‌న చెప్పిన కథ‌ల‌కు చ‌ర‌ణ్ ఓకే చెప్ప‌లేదంట‌. పైగా చ‌ర‌ణ్ ఇప్పుడు భారీ ప్రాజెక్టుల్లో న‌టిస్తున్నాడు. ఇప్ప‌టికే ఆర్ ఆర్ ఆర్ చేస్తుండ‌తా త‌ర్వాత ప్ర‌ముఖ డైరెక్ట‌ర్ శంకర్‌తో మ‌రో సినిమా ప్లాన్ చేస్తున్నాడు. దీంతో ఈ క‌థ‌ను మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కు చెప్పి ఒప్పించాడంట వెంకీ. ప్ర‌స్తుతం వ‌రుణ్ చేస్తున్న గ‌ని, ఎఫ్ -3 మూవీలు అయిపోగానే ఈ ప్రాజెక్టును ప‌ట్టాలెక్కిస్తారంట‌.

Read more RELATED
Recommended to you

Latest news