మహేష్ తో సినిమా చేయకపోవడానికి కారణం అదే అంటున్న నిర్మాత..!!

-

టాలీవుడ్ ఇండస్ట్రీలో సుమంత్ ఆర్ట్ ప్రొడక్షన్స్ ద్వారా ఎన్నో అద్భుతమైన సినిమాలు వచ్చాయని చెప్పవచ్చు . నిర్మాతగా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఎం.ఎస్.రాజు గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈయన బ్యానర్లో వర్షం, ఒక్కడు, మనసంతా నువ్వే, పౌర్ణమి వంటి తదితర బ్లాక్ బస్టర్ సినిమాలు తెరకెక్కించారు. కొంతకాలం పాటు ప్రొడక్షన్ కి దూరంగా ఉన్నటువంటి ఎమ్మెస్ రాజు తాజాగా 7డేస్స్ 6 నైట్స్ ద్వారా మరొకసారి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఆన్ లోనే ఈ సినిమా త్వరలోనే విడుదల కావడంతో ఈ సినిమా ప్రమోషన్ లో కూడా బుల్లి తెర పై పలు కార్యక్రమాలకు హాజరవుతూ సందడి చేశారు.18YearsForOkkadu: MS Raju thanks the team of Okkadu, hints sequel with Mahesh Babu | Telugu Movie News - Times of India

తాజాగా ఆలీతో సరదాగా కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెస్ రాజు తన కెరీర్ గురించి పలు ఆసక్తికరమైన విషయాలను తెలియ జేశారు. కథను నమ్మి సినిమా చేస్తానని స్టార్ హీరోలను నమ్మి సినిమాలు చేయానని తెలిపారు. కష్టాలలో ఉన్న సమయంలో మనసంతా నువ్వే సినిమా ఎన్నో లాభాలను తెచ్చిపెట్టింది అని గుర్తుచేసుకున్నారు. మహేష్ బాబు ఒక్కడు సినిమా ని తన బ్యానర్ లో వచ్చిన తర్వాత బ్లాక్ బాస్టర్ హిట్ ను అందుకున్ననని తెలిపారు.MS Raju giving feelers about a film with Mahesh Babu

ఈ సినిమా మంచి విజయం అయిన తరువాత మహేష్ తో ఒక్క సినిమా కూడా చేయలేదు ఇలా సినిమా చేయకపోవడానికి కారణం ఏమిటి అనే ప్రశ్న ఎదురవగానే ఆయన అందుకు ఆసక్తి కరమైన సమాధానం తెలిపారు. ఒక్కడు సినిమా తర్వాత ఒకరు ఇద్దరు డైరెక్టర్లు వచ్చి మహేష్ కోసం ఓ కథ వినిపించారని అయితే తనకు కథ మాత్రం నచ్చలేదు మహేష్ తో సినిమా చేయకపోయినా పర్వాలేదు కానీ ఒక్కడు సినిమా పేరు ను చెడగొట్ట కూడదనుకున్నాను అందుకే ఆ తర్వాత తన బ్యానర్లో మహేష్ బాబు సినిమా చేయలేకపోయానని విషయాన్ని తెలియజేశారు.

Read more RELATED
Recommended to you

Latest news