సోనూసూద్ పై మండిపడుతున్న ఆ స్టార్ హీరో అభిమానులు కారణం..?

-

తాజాగా రియల్ హీరో సోనూ సూద్ పై దివంగత నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అసలు విషయంలోకెళితే తాజాగా MTV రోడీస్ సీజన్ 19 షూటింగ్ పనులలో సోనూ సూద్ బిజీగా ఉన్న విషయం తెలిసిందే. ఇక ఇదే ప్రాజెక్టులో నటి రియా చక్రవర్తి కూడా భాగం పంచుకున్నారు. ఇందుకు సంబంధించిన షూటింగ్ ప్రస్తుతం హిమాచల్ ప్రదేశ్ లో జరుగుతున్న నేపథ్యంలో అక్కడ సెట్ లో ఉన్న వారి కోసం సోనూ సూద్ దోశెలు వేసి మరి టిఫిన్ వడ్డించారు. ఇక ఇదే సమయంలో అక్కడికి నటి రియా చక్రవర్తి కూడా రాగా మీకు ఎలాంటి దోశె కావాలి అని అడిగి మరీ ఆమె కోరుకున్నట్లు టిఫిన్ చేసి ఇచ్చారు సోనూ సూద్.

ఇక ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి సోనూ ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేయగా.. ఇది చూసిన అభిమానులు మీరంటే మాకు చాలా గౌరవం అది ఎప్పటికీ కొనసాగుతూ ఉంటుంది. కానీ ఈ చర్యతో మీపై మరింత గౌరవం పెరిగింది అని.. కొంతమంది అభిమానులు కామెంట్లు చేస్తుంటే.. ఇది చూసిన బాలీవుడ్ యువ నటుడు దివంగత హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ అభిమానులు మాత్రం అసహనం వ్యక్తం చేస్తున్నారు.

మీరు ఆమెకు దోశెలు చేసి పెట్టడం ఏంటి? ఇలా చేయడం మాకు ఏమాత్రం నచ్చడం లేదు.. అంటూ తమ అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇక సుశాంత్ సింగ్ ఆత్మహత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొని.. కొంతకాలం జైలులో ఉన్న విషయం అందరికీ తెలిసిందే. అందుకే ఆయన అభిమానులు ఈ విధంగా సలహాలు ఇస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news