మహేష్ బాబు ఇంట్లో చోరీకి పాల్పడ్డ దుండగులు.. కట్ చేస్తే..!!

-

సూపర్ స్టార్ మహేష్ బాబు తల్లి ఇందిరాదేవి నిన్న ఉదయం కన్నుమూసిన విషయం తెలిసిందే.. ఇకపోతే ఒక రోజుకు ముందు మహేష్ బాబు ఇంట్లో చొరబడడానికి ఒక వ్యక్తి విఫల ప్రయత్నం చేసిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇకపోతే సూపర్ స్టార్ కృష్ణ భార్య మహేష్ బాబు తల్లి ఇందిరాదేవి అనారోగ్యంతో కన్నుమూయడంతో వారి కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ముఖ్యంగా జనవరిలో ఇదే ఏడాది వారి పెద్ద కుమారుడు రమేష్ బాబు కన్ను మూసిన సంఘటన మరువకముందే తాజాగా కృష్ణ సతీమణి ఇందిరా దేవి కూడా కన్నుమూయడం విషాదకరంగా మారింది.

ఇక ఆమె వయసు 70 సంవత్సరాలు.. ముఖ్యంగా ఈ రెండు ఘటనలు ఇదే సంవత్సరంలో జరగడంతో మహేష్ ఇంట్లో తీవ్ర విషాదఛాయలు అలుముకున్నాయి. ఇదిలా ఉండగా కృష్ణ ఫ్యామిలీ పుట్టెడు దుఃఖంలో ఉండగా ఈ సంఘటనకు ముందే మహేష్ బాబు ఇంట్లో ఒక వ్యక్తి దొంగతనానికి చొరబడ్డారు. ఇక మహేష్ బాబు హైదరాబాదులో ఉంటున్న జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 81 లో ఈ మంగళవారం అర్ధరాత్రి ఒడిస్సా కు చెందిన కృష్ణ అనే వ్యక్తి మహేష్ బాబు ఇంటి ప్రహరీ గోడ దూకి ఇంట్లోకి వెళ్లే ప్రయత్నం చేశాడు. ఇక మహేష్ బాబు ఇంటికి 10 అడుగులకు పైగా పెద్ద ప్రహరీ గోడ ఉంది. ఆ గోడ నుంచి దూకడంతో ఆ వ్యక్తికి తీవ్రంగా గాయాలయ్యాయి..

ఇక ఆ శబ్దానికి అలర్ట్ అయిన సెక్యూరిటీ గార్డులు ఘటన స్థలానికి వెళ్లగా తీవ్ర గాయాల పాలైన వ్యక్తి మూలుగుతూ కనిపించాడు. వెంటనే సెక్యూరిటీ సిబ్బంది పోలీసులకు సమాచారం ఇవ్వడం జరిగింది.. ఇక పోలీసులు ఆ వ్యక్తిని హాస్పిటల్లో చేర్పించారు.. అతడిని పోలీసులు విచారించగా మూడు రోజుల క్రితం ఒడిస్సా నుంచి హైదరాబాద్ కి వచ్చి అక్కడ సమీపంలో ఉన్న ఒక మొక్కలు నర్సరీలో పనిచేస్తున్నట్టు తెలిపారు..అయితే ఎందుకు గోడ దూకే ప్రయత్నం చేశాడు అనే విషయం మాత్రం ఇంకా చెప్పలేదు.

Read more RELATED
Recommended to you

Latest news