ఇది బన్నీ ఫ్యాన్స్ కి అతి పెద్ద షాకింగ్ వార్తే…..!!

-

టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం అల వైకుంఠపురములో అనే సినిమాలో హీరోగా నటిస్తున్నారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో హారిక హాసిని క్రియేషన్స్, గీతా ఆర్ట్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో బన్నీ సరసన పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తుండగా సీనియర్ నటి టబు ఈ సినిమాలో బన్నీకి అక్కగా నటిస్తున్నట్లు తెలుస్తోంది. మంచి ఫ్యామిలీ ఎమోషన్స్ తో ఆకట్టుకునే కథ, కథనాలతో పలు ఎంటర్టైన్మెంట్ అంశాలు కలగలిపి దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నట్లు సమాచారం.

ఈ సినిమాను రాబోయే సంక్రాంతి కానుకగా జనవరి 12న రిలీజ్ చేయనున్నారు. ఇకపోతే దీని తరువాత బన్నీ, సుకుమార్ దర్శకత్వంలో నటించనున్న విషయం తెలిసిందే. మైత్రి మూవీ మేకర్స్ సంస్థ పై బన్నీ 20వ సినిమాగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో హీరోయిన్ గా రష్మిక మందన్న నటిస్తుండగా రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నారు. కాగా ఈ సినిమాకు సంబంధించి ఒక షాకింగ్ న్యూస్ ప్రస్తుతం పలు టాలీవుడ్ వర్గాల్లో ప్రచారం అవుతోంది. అదేమిటంటే, ఈ సినిమాలో కేవలం మూడు సాంగ్స్ మాత్రమే ఉంటాయని, అందులో ఒకటి హీరో ఇంట్రడక్షన్ సాంగ్ కాగా మరొకటి హీరో, హీరోయిన్ల మధ్య వచ్చే రొమాంటిక్ డ్యూయెట్, మూడవది ఒక ఫోక్ సాంగ్ అని సమాచారం. కాగా వీటిలో అప్పుడే సుకుమార్, దేవి కలిసి రెండు పాటల కంపోజింగ్ పూర్తిచేశారని కూడా సమాచారం.

 

ఒకప్పటితో పోలిస్తే రాను రాను మన సినిమాల్లో సాంగ్స్ తగ్గిపోతున్న విషయం తెలిసిందే. సాంగ్స్ తగ్గించడం వలన సినిమా టైం కొద్దిగా కలిసి రావడం జరుగుతుందని, అలానే కొన్ని స్క్రిప్ట్ బేస్డ్ సినిమాలకు పూర్తిగా ఆరు పాటలు పెట్టలేక పోవడంతో కొందరు దర్శకులు 3 పాటలతో సరిపెడుతున్న ఘటనలు ఇటీవల పలు సినిమాల విషయంలో జరిగాయి. గంధపు చెక్కల స్మగ్లింగ్ నేపథ్యంలో పూర్తి స్థాయి యాక్షన్ ఎంటెర్టైనర్ గా తెరకెక్కనున్న ఈ సినిమాలో బన్నీ, రష్మిక పూర్తి స్థాయి మాస్ క్యారెక్టర్స్ లో అలరించనున్నారు. ఈ సినిమాలో కేవలం మూడు సాంగ్స్ మాత్రమే ఉండడం, బన్నీ ఫ్యాన్స్ కి ఒకింత చేదు వార్తే అని అంటున్నారు సినీ విశ్లేషకులు. కాగా ప్రస్తుతం ప్రచారం అవుతున్న ఈ వార్తపై అధికారిక ప్రకటన మాత్రం వెలువడవలసి ఉంది…..!!

Read more RELATED
Recommended to you

Exit mobile version