రాజమౌళి-మహేశ్ మూవీలో థోర్.. హాలీవుడ్ రేంజ్​లో ప్లాన్ చేసిన జక్కన్న!

-

డైరెక్టర్ రాజమౌళి, సూపర్ స్టార్ మహేశ్​ బాబు కాంబినేషన్​లో ఓ భారీ సినిమా రానున్న సంగతి తెలిసిందే. ఇంకా సెట్స్​పైకి వెళ్లని ఈ చిత్రం గురించి రోజుకో ఇంట్రెస్టింగ్​ వార్త బయటకు వస్తోంది. నిన్నటివరకు ఈ సినిమా కోసం జక్కన్న హాలీవుడ్ నుంచి ఓ స్టార్ యాక్టర్​ను రంగంలోకి దించబోతున్నట్లు వార్తలు వినిపించాయి. అయితే అది ఇప్పుడు ఒక్కరు కాదు ఇద్దరు స్టార్ యాక్టర్స్​ అని తెలుస్తోంది.

ఎక్స్​ఎక్స్​ఎక్స్​, కెప్టెన్​ మార్వెల్​, స్టార్​ వార్స్​, జురాసిక్​ పార్క్​, స్పైడర్​ మ్యాన్, అవెంజర్స్​, కెప్టెన్​ అమెరికా​​ వంటి హిట్​ చిత్రాల్లో నటించిన ప్రముఖ హాలీవుడ్ నటుడు శామ్యూల్​ ఎల్​ జాక్స్​తో పాటు తాజాగా అవెంజర్స్​ థోర్​ ఫేమ్ హీరో​ క్రిస్ హెమ్స్ వర్త్​ను తీసుకోబోతున్నట్లు సోషల్​మీడియాలో జోరుగా ప్రచరాం సాగుతోంది. శామ్యూల్​ కీలక పాత్ర పోషించబోతుండగా.. క్రిస్​ అతిథి పాత్రలో కనిపిస్తారట. ప్రస్తుతం నెట్టింట్లో ఈ విషయమే తెగ ట్రెండ్ అవుతోంది. అభిమానులు దీనిపై తెగ చర్చించుకుంటున్నారు. హర్షం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ వార్తలో ఎంత నిజమున్నదో తెలియదు కానీ సినిమాపై అంచనాలు మాత్రం ఆకాశాన్ని అంటుతున్నాయి. కాగా, శామ్యూల్​ ఒక్కో చిత్రానికి కనీసం రూ.80కోట్లు నుంచి 160కోట్లు రెమ్యునరేషన్​ను తీసుకుంటాడు. ఇక క్రిస్​ అయితే అంతకన్నా ఎక్కువే తీసుకుంటాడు.

ఇటీవలే రాజమౌళి మహేశ్​ సినిమా ఎలా ఉండబోతుందో తెలిపారు. ‘ప్రపంచాన్ని చుట్టి వచ్చే సాహసికుడి కథ’ అంటూ యాక్షన్‌ అడ్వెంచర్‌ మూవీగా ఇది ఉంటుందని పేర్కొన్నారు. ఈ చిత్రాన్ని పాన్‌ ఇండియా స్థాయిలో కె.ఎల్‌.నారాయణ నిర్మించనున్నారు. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన పూర్వ నిర్మాణ పనులు సాగుతున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news