మహేష్ జాతకం వల్లే ఆ మరణాలు.. హాట్ బాంబు పేల్చిన వేణు స్వామి..!

-

ప్రముఖ ఆస్ట్రాలజర్ వేణు స్వామి ఎప్పుడు సెలబ్రిటీల వ్యక్తిగత జీవితాలలో తలదూరుస్తూ సంచలన వ్యాఖ్యలు చేస్తూ హాట్ టాపిక్ గా మారుతూనే ఉంటారు. ఈ క్రమంలోనే మహేష్ బాబు జాతకం వల్లే వారి కుటుంబంలో వరస మరణాలు చోటు చేసుకుంటున్నాయి అంటూ మరో హాట్ బాంబు పేల్చాడు. ఓకే ఏడాది సూపర్ స్టార్ కృష్ణ కుటుంబంలో మూడు విషాదాలు చోటు చేసుకున్నాయి. ముందుగా సూపర్ స్టార్ కృష్ణ పెద్ద కుమారుడు రమేష్ బాబు జనవరిలో మరణించగా.. ఆ తర్వాత సూపర్ స్టార్ కృష్ణ సతీమణి ఇందిరా దేవి సెప్టెంబర్ లో మరణించారు. ఆ తర్వాత సూపర్ స్టార్ కృష్ణ కూడా నవంబర్లో మరణించిన విషయం తెలిసిందే.

ఒకే కుటుంబంలో ముగ్గురు మరణించడంతో మహేష్ బాబు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. అయితే ఇలా ఒకే కుటుంబంలో ఒకే ఏడాది మూడు విషాద సంఘటనలు చోటు చేసుకోవడం వెనుక ఏదైనా జాతకరీత్యా కారణాలు ఉన్నాయా? అంటే తాజాగా ప్రముఖ ఆస్ట్రాలజర్ వేణు స్వామి కూడా ఇదే విషయాన్ని వెల్లడించారు. మహేష్ బాబు జాతకం వల్లే ఇదంతా జరిగింది అంటూ తెలిపారు వేణు స్వామి 2016 – 2017 సంవత్సరాల వరకు అన్ని కార్యక్రమాలు తన చేతుల మీదే జరిగేవని.. ఎక్కువగా పద్మాలయ స్టూడియోలోనే తాను ఉండేవాడిని అని వేణు స్వామి వెల్లడించారు.

జాతకం చూసి ఎలా ఉందో చెప్పమని విజయనిర్మల అడిగితే 2020 తర్వాత ఇంట్లో వరుస మరణాలు సంభవిస్తాయని చెప్పానని అప్పటివరకు ఏ చిన్న కార్యక్రమమైనా తన చేతుల మీదే జరిపించే విజయనిర్మలమ్మ అప్పటినుంచి తనను దూరం పెట్టింది అంటూ వేణు స్వామి వెల్లడించారు. అలాగే మహేష్ బాబు జాతకరీత్యా శని, గురు గ్రహాలు మారుతూ ఉన్నాయి. ఆ ఎఫెక్ట్ తండ్రి ఆరోగ్యం ,తల్లి ఆరోగ్యం మీద పడింది అందుకే వారిద్దరు చనిపోయారు. ముఖ్యంగా మహేష్ బాబు సింహరాశిలో పుట్టడం వల్లే ఇలా జరిగింది అంటూ ఆయన అభిప్రాయపడ్డారు.

Read more RELATED
Recommended to you

Latest news