Tarakaranta : తారకరత్న కన్నుమూత.. ప్రముఖుల సంతాపం

-

టాలీవుడ్ నటుడు నందమూరి తారకరత్న(40) గత 23 రోజులుగా ప్రాణాలతో పోరాడుతూ శనివారం రోజున కన్నుమూశారు. ఇవాళ తారక్ భౌతిక కాయాన్ని బెంగళూర్ నుంచి హైదరబాద్ తరలించనున్నారు. ఇవాళే తారక్ అంత్యక్రియలు నిర్వహించనున్నారు. తారక్ మృతి తో సినీ ఇండస్ట్రీలో విషాదం నెలకొంది.

సినీ ప్రముఖులు తారక్ మృతిపై సంతాపం తెలియజేస్తున్నారు. తారకరత్న మృతి పట్ల మెగాస్టార్ చిరంజీవి కూడా సంతాపం తెలిపారు. ప్రతిభావంతుడైన నటుడిని కోల్పోవడం బాధాకరమంటూ  ఆవేదన వ్యక్తం చేశారు. తారకరత్న కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

పవన్​ కల్యాణ్​ ట్వీట్ చేస్తూ.. “గత మూడు వారాలుగా బెంగళూరు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న తారకరత్న కోలుకుంటారని భావించాను. ఆయన నటుడిగా రాణిస్తూనే ప్రజా జీవితంలో ఉండాలనుకున్నారు. ఆ ఆశలు నెరవేరకుండానే కన్నుమూయడం దురదృష్టకరం. తారకరత్న భార్యాపిల్లలకు, తండ్రి మోహనకృష్ణ, బాబాయి బాలకృష్ణ, ఇతర కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను” అని అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news