అక్కినేని ఫ్యామిలీకి జ‌గ‌న్ ఆఫ‌ర్ ?

-

  • టీటీడీ బోర్డులోకి సుమంత్?
  • టీటీడీ బోర్డులో టాలీవుడ్ హీరో ?

ఏపీలో వై.ఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ప్ర‌భుత్వం అధికారంలోకి రావ‌డంతో గ‌త ప్ర‌భుత్వంలో నామినేటేడె్ స‌భ్యులంతా ఆయా శాఖ‌ల‌కు రాజీనామాలు చేసిన సంగ‌తి తెలిసిందే. దీనిలో భాగంగా ఇటీవ‌లే టీడీడీ బోర్డ్ చైర్మ‌న్ వై.వి సుబ్బారెడ్డ్డిని నియ‌మించిన సంగ‌తి తెలిసిందే. ఇక బోర్డు ఏర్పాటు ఉండ‌బోతుంది. బోర్డులు ప్ర‌ముఖ‌ల‌కు చోటు ఇవ్వ‌డం అన‌వాయితీగా వ‌స్తోన్న సంగ‌తి తెలిసిందే. ఇత‌ర రాష్ర్టాల‌కు చెందిన ప్ర‌ముఖుల‌తో పాటు, వివిధ రంగాల‌కు చెందిన వారిని ఎంపిక చేస్తున్నారు. ఈ నేపథ్యంలో టాలీవుడ్ నుంచి ఇద్ద‌రు పేర్లు వినిపిస్తున్నాయి. అందులో ఒక‌రు నిర్మాత దిల్ రాజు కాగా, మ‌రోక‌రు న‌టుడు స‌మంత్ కావ‌డం విశేషం. అయితే జ‌గ‌న్ తో దిల్ రాజు కు పెద్ద‌గా సంబంధాలు లేని నేప‌థ్యంలో ఆయ‌న పేరు వినిపిస్తుండ‌టం విశేషం.

ఇందులో నిజ‌మెంత‌న్న‌ది తెలియాల్సింది. ఇక సుమంత్-జ‌గ‌న్ మంచి స్నేహితులు. ఇద్ద‌రు స్కూల్ డేస్ లో క్లాస్ మేట్స్. అక్కినేని ఫ్యామిలీతోనూ జ‌గ‌న్ కు మంచి స‌త్స‌సంబంధాలున్నాయి. ఎన్నిక‌ల స‌మ‌యంలో జ‌గ‌న్ అమ‌లకు ఎంపీ సీటు ఆఫ‌ర్ చేసిన‌ట్లు కూడా ప్ర‌చారంలోకి వ‌చ్చింది. అదే స‌మ‌యంలో నాగార్జున త‌రుచూ జ‌గ‌న్ ట‌చ్ లో ఉండ‌టం వంటివి మ‌రింత వేడిని పెంచాయి. కానీ రాజ‌కీయాల‌కు అక్కినేని ఫ్యామిలీ దూరమంటూ కింగ్ ముగింపు ప‌లికాడు. కానీ బ్యాకెండ్ నాగార్జున‌, జ‌గన్ కు మ‌ద్దతిచ్చారు. ఈ నేప‌థ్యంలో జ‌గ‌న్ అధికారంలోకి వ‌చ్చిన సంద‌ర్భంగా టీటీడీ బోర్డులో అక్కినేని ఫ్యామిలీలో ఎవ‌రో ఒక‌రికి బాధ్య‌త‌లు అప్ప‌గిస్తే బాగుటుంద‌ని జ‌గ‌న్ భావిస్తున్నారుట‌.

ఈ నేప‌థ్యంలో అమ‌ల పేరును జ‌గ‌న్ సూచించ‌గా కింగ్ అందుకు తిరస్క‌రించి సుమంత్ అయితే బాగుంటుంద‌ని స‌జ్జెస్ట్ చేసారుట‌. అమ‌ల సామాజిక కార్య‌క్ర‌మాల్లో బిజీగా ఉంటార‌ని..ఈ నేప‌థ్యంలో రెండు ప‌డ‌వ‌ల ప్ర‌యాణం స‌వ్యంగా ఉండ‌ద‌నే నాగ్ తిర‌స్క‌రించిన‌ట్లు వినిపిస్తోంది. ఇక‌ జ‌గ‌న్ కు సుమంత్ మంచి స్నేహితుడు కాబ‌ట్టి బోర్డులో స‌భ్య‌త్వం ఇచ్చినా ఆశ్చ‌ర్య‌పోన‌వ‌స‌రం లేదు. ప్ర‌స్తుతం సుమంత్ కు సినిమాలు కూడా లేని నేప‌థ్యంలో స‌భ్య‌త్వం కోసం ఆయ‌న కూడా ఆస‌క్తి చూపిస్తున్న‌ట్లు స‌న్నిహిత వ‌ర్గాల నుంచి తెలిసింది.

Read more RELATED
Recommended to you

Latest news