లైవ్ డిబెట్ లో చితక్కొట్టుడు.. వైరల్ వీడియో

-

డిబెట్ లో పాల్గొన్న పీటీఐ నేత మసూర్ అలీ, కరాచి ప్రెస్ క్లబ్ ప్రెసిడెంట్ ఇమ్తియాజ్ ఖాన్ లు డిబెట్ లో రెచ్చిపోయి ఒకరినొకరు కొట్టుకున్నారు. ఇమ్తియాజ్ ఖాన్.. ప్రభుత్వాన్ని విమర్శిస్తూ మాట్లాడుతుండగా… మసూర్ అలీ కోపంతో ఇమ్తియాజ్ పై చేయి చేసుకొని వెనక్కి నెట్టాడు.

సాధారణంగా న్యూస్ చానెల్స్ వాళ్లు డిబెట్లు పెడుతుంటారు కదా. దానిలో కొత్తేమీ ఉండదు. ఏదో ఒక కరెంట్ ఇష్యూ మీద కొందరు ప్రముఖులతో చర్చా కార్యక్రమం పెడుతుంటారు. అది కామన్. అయితే.. ఒక్కోసారి డిబెట్ లో పాల్గొనడానికి వచ్చే వాళ్లలో మాటా మాటా పెరిగి వాళ్లకు వాళ్లే తిట్టుకుంటారు. అసలు టాపిక్ ను వదిలేసి.. వాళ్లలో వాళ్లు తిట్టుకోవడం.. ఒక్కోసారి కొట్టుకోవడం కూడా జరుగుతుంది. కాకపోతే మరీ అంత రేంజ్ ఉండకపోవచ్చు. కానీ.. ఒక్కోసారి వాళ్ల ఆవేశం కట్టలు తెంచుకొని వస్తే మాత్రం ఎవ్వరూ ఏం చేయలేరు. అది లైవ్ షో అన్న విషయం కూడా మరిచిపోతారు.

ఇటీవల పాకిస్థాన్ లో కూడా అదే జరిగింది. ఓ న్యూస్ చానెల్ డిబెట్ లో పాల్గొన్న ఇద్దరు నేతలు చితక్కొట్టుకున్నారు. న్యూస్ చానెల్ కూడా వాళ్ల ఫైటింగ్ షోను అలాగే కంటిన్యూ చేసింది. లైవ్ ను కట్ చేయలేదు. న్యూస్ లైన్ విత్ అఫ్తాబ్ మఘేరి అనే డిబెట్ షోలోనే ఈ ఫైటింగ్ షో జరిగింది.

డిబెట్ లో పాల్గొన్న పీటీఐ నేత మసూర్ అలీ, కరాచి ప్రెస్ క్లబ్ ప్రెసిడెంట్ ఇమ్తియాజ్ ఖాన్ లు డిబెట్ లో రెచ్చిపోయి ఒకరినొకరు కొట్టుకున్నారు. ఇమ్తియాజ్ ఖాన్.. ప్రభుత్వాన్ని విమర్శిస్తూ మాట్లాడుతుండగా… మసూర్ అలీ కోపంతో ఇమ్తియాజ్ పై చేయి చేసుకొని వెనక్కి నెట్టాడు. దీంతో ఇమ్తియాజ్ కూడా అతడిపై దాడికి దిగాడు. అలా న్యూస్ రూమ్ లో కాసేపు ఫైటింగ్ షో నడిచింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Read more RELATED
Recommended to you

Latest news