టాలీవుడ్ హీరోయిన్ అమృత అయ్యర్ అకౌంట్ హ్యాక్..పోలీసులకు ఫిర్యాదు !

-

టాలీవుడ్‌ హీరోయిన్‌ అమృత అయ్యర్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. 30 రోజుల్లో ప్రేమించడం ఎలా.. రామ్‌ రెడ్‌ సినిమాల్లో కనిపించి.. తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. అయితే.. ఆ రెండు సినిమా అనుకున్న స్థాయిలో ఆడకపోవడంతో… ఆమెకు నిరాశ తప్పలేదు. ఇక ఇటీవలే టాలీవుడ్ యంగ్‌ హీరో శ్రీ విష్ణు హీరోగా నటించిన.. అర్జున ఫల్గుణ సినిమాలోనూ అమృతా అయ్యర్‌ నటించింది. ఈ సినిమా డిసెంబర్‌ 31 వ తేదీన విడుదలైంది.

అయితే.. ఈ సినిమా కూడా తెలుగు ప్రేక్షకులను ఏ మాత్రం ఆకట్టుకోలేదు. ఇక మరో రెండు సినిమాలు లైన్‌ లో పెట్టింది ఈ భామ. అయితే… తాజాగా హీరోయిన్‌ అమృత అయ్యర్‌ కు ఊహించని షాక్‌ తగిలింది. హీరోయిన్‌ అమృత అయ్యర్‌ ఇన్‌ స్టాగ్రామ్‌ అకౌంట్‌ ను ఎవరో హ్యాక్‌ చేశారు. ఈ విషయాన్ని స్వయంగా తన ట్విట్టర్‌ ద్వారా తెలిపింది. దీనిపై పోలీసులకు హీరోయిన్‌ అమృత అయ్యర్‌.. ఫిర్యాదు చేసినట్లు సమాచారం అందుతోంది. ఇక దీనిపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news