టాలీవుడ్ రూమర్స్..ఏది నిజం-ఏది వైరల్…!

-

సినీ పరిశ్రమ అంటేనే రూమర్స్ .ఇవి లేకుండా ఏ సినీ పరిశ్రమ కనిపించదు.కొన్ని సార్లు ఈ ఫేక్ న్యూస్ అటు సినిమాలనే కాకుండా… తారల ఇమేజ్ ను డ్యామేజ్ చేస్తుంది.ఇంకొన్నిసార్లు లేని ఇమేజ్ ను తెచ్చిపెడుతుంటుంది. అందుకే మొదటినుంచి రూమర్స్ విషయంలో ఎలాంటి డెసిషన్ తీసుకోలేక పోతున్నారు. ఈ రూమర్స్ కి కొందరు వెంటనే చెక్ పెడుతూ ఉంటే ఇంకొందరు వైరల్ పోస్ట్ లను చూస్తూ ప్రీ ప్రమోషన్ దొరికింది కదా అని చెప్పి ఎంజాయ్ చేస్తున్నారు. తాజాగా టాలీవుడ్ పరిశ్రమలో వస్తున్న రూమర్స్ పై స్పెషల్…

మరీ ఫిక్షనల్ గా మారిపోతూ ఉండడంతో కొందరు వెంటనే రియాక్ట్ అవ్వాల్సి వస్తుంది.అలాంటి వారిలో దర్శకుడు గుణశేఖర్ ముందుగా కనిపిస్తాడు.నెట్ ఫ్లిక్స్ తో గుణాకు ఓ డీల్ సెట్ అయ్యిందని…అయితే కథ నచ్చకపోవడంతో ఆ ప్రాజెక్ట్ పట్టాలెక్కడం లేదని కొన్ని రోజులుగా వస్తున్న వార్తలకు ఆయన చెక్ పెట్టేశాడు. అధికారికంగా స్పందిస్తూ అలాంటివేం లేవని ఇలాంటి వదంతులను నమ్మవద్దని సెలవిచ్చాడు.

ఇక ట్రెండ్ లో నిలిచే సినిమాల విషయంలోను ఇలాంటి రూమర్సే రౌండ్లు కొడుతూ ఉంటాయి.అలాంటి వాటిలో సర్కారు వారి పాట సినిమాను ప్రత్యేకంగా చెప్పుకోవాలి.ఇందుల్లో స్టయిలిష్ విలన్ గా అరవింద్ స్వామి ఓకే అయినట్లుగా చాలారోజులగా వార్తలు వస్తున్నాయి.లేటెస్ట్ న్యూస్ ప్రకారం అలాంటిదేం లేదని ఇది జస్ట్ వైరల్ న్యూసే అని రియల్ ఏమాత్రం కాదని తెలిసింది.అరవింద్ కాదని అలా వచ్చిందో లేదో వెంటనే సుదీప్ పేరు లైమ్ లైట్లోకొచ్చింది.ఇందుల్లోను నిజం లేదని తెలుస్తుంది.

ఇక గత కొన్ని నెలలుగా టాలీవుడ్లో అయ్యప్పనుమ్ కోషియుమ్ సినిమాపై వచ్చినన్ని రూమర్స్ ఏ సినిమాకు రాలేదు. అయ్యప్పన్ ,కోషి పాత్రలు ఎవరు చేస్తారు అనే దానిపై పెద్ద చర్చే జరిగింది.కోషిగా రానా పేరు చాలా రోజులు వచ్చింది.అయ్యప్పన్ గా బాలయ్యబాబు,వెంకటేష్ ,రవితేజల పేర్లు వినిపించాయి.చివరకు చిరంజీవి,పవన్ లు అయ్యప్పనుమ్ కోషియుమ్ లుగా కలరింగ్ ఇస్తారని ఓ రూమర్ గట్టిగా వైరల్ అవుతుంది.సితార ఎంటర్ టైన్ మెంట్ చినబాబు పవన్ కు క్లోజ్ కావడంతో ఈ రూమర్ కు బలం వచ్చింది.త్వరలో నిర్మాతలు ఈ రెండు పాత్రలు చేసేది ఎవరనేదానిపై ఓ క్లారిటీ ఇస్తే ఈ రూమర్స్ కు చెక్ పెట్టినట్లవుతుంది.

Read more RELATED
Recommended to you

Latest news