టాలీవుడ్ కొత్త మార్గం…!

-

టాలీవుడ్ లో ఇప్పుడు సినిమా మార్కెట్ భారీగా పెరిగింది. టాలీవుడ్ లో చేసే సినిమాలు అన్నీ కమర్షియల్ గా ఉంటున్న సంగతి తెలిసిందే. ప్రతీ సినిమా కూడా కమర్షియల్ హంగులతో ఉంటుంది. టాలీవుడ్ హీరోలు ఎక్కువగా కమర్షియల్ సినిమాలను ఎక్కువగా దృష్టి లో పెట్టుకుంటున్నారు. దీనితో ఇప్పుడు నిర్మాతలు, దర్శకులు కొత్త మార్గాలను అనుసరిస్తున్నారు. మార్కెట్ పెంచుకోవడానికి గానూ…

బాలీవుడ్ మీద ఎక్కువగా ఆధారపడుతున్నారు. ఇప్పుడు వస్తున్న సినిమాల్లో బాలీవుడ్ స్టార్ హీరోలను కూడా తీసుకోవాలని వారితో కాస్త తక్కువ నిడివి ఉన్న పాత్రను అయినా చేయిస్తే మంచిది అనే భావన లోకి వచ్చారు. సల్మాన్ ఖాన్, రణవీర్ సింగ్ సహా కొందరు హీరోలను ఇప్పుడు తెలుగులో తీసుకునే ఆలోచనలో ఉన్నారు. అక్కడి నిర్మాతలు కూడా తెలుగు మార్కెట్ మీద ఎక్కువగా ఫోకస్ చేస్తున్నాడు.

అక్కడి నిర్మాతలు ఇక్కడి హీరోల సినిమాలను అక్కడ రీమేక్ చెయ్యాలని చూస్తున్నారు. అక్కడి సినిమాలను కూడా ఇక్కడ రీమేక్ చేసే ఆలోచన చేస్తున్నారు. అలా అయితే వసూళ్లను భారీగా పెంచుకునే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. పాన్ ఇండియా సినిమాల మీద ఎక్కువగా దృష్టి పెడుతున్నారు. ఇక హీరోయిన్స్ ని కూడా అక్కడి వారినే ఎక్కువగా తీసుకుంటే మంచిది అనే భావనలో ఉన్నారని తెలుస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news