ఎన్.టి.ఆర్ సినిమా తర్వాత త్రివిక్రమ్ పవన్ కళ్యాణ్ కాంబో రెడీ …ఈ సారి బాక్సులు బద్దలే ..!

-

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ అల్లు అర్జున్ తో అల వైకుంఠపురములో సినిమాతో సూపర్ హిట్ అందుకున్నారు. త్రివిక్రమ్ తర్వాత సినిమాని యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ తో తెరకెక్కిస్తున్నసంగతి తెలిసిందే. ఈ సినిమాకి కూడా త్రివిక్రమ్ శ్రీనివాస్ ‘అ’ సెంటిమెంట్ ని కంటిన్యూ చేస్తూ ‘అయినను పోయిరావలె హస్తినకు..’ అనే టైటిల్ ను ఫైనల్ చేశారు. ఇంతకముందు ఈ ఇద్దరి కాంబినేషన్ లో వచ్చిన ‘అరవింద సమేత వీర రాఘవ’ మంచి యాక్షన్ ఎంటర్‌టైనర్ గా తెరకెక్కి బ్లాక్ బస్టర్ హిట్ ని సాధించింది. దాంతో మళ్ళీ త్రివిక్రమ్ ఎన్.టి.ఆర్ కాంబినేషన్ అనగానే ప్రేక్షకుల్లో భారీగా అంచనాలు నెలకొన్నాయి.

 

ఇక ఈ సినిమా తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో చేయనున్నారని తాజా సమాచారం. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ నటిస్తున్న వకీల్ సాబ్ షూటింగ్ చివరై దశకి చేరుకుంది. ఇక ఈ సినిమా తర్వాత క్రిష్ సినిమాతో సెట్స్ మీదకి వెళ్ళనున్నారు. ఈ సినిమా పీరియాడిక్ మూవీగా భారీ బడ్జెట్ తో రూపొందనుంది. తర్వాత గబ్బర్ సింగ్ లాంటి సంచలనం సృష్ఠించిన హరీష్ శంకర్ తో సినిమా చేసే అవకాశాలున్నాయి.

అలాగే త్రివిక్రం తోను సమాంతరంగా సినిమా ఉండబోతుందని తాజా సమాచారం. ఇప్పటికే త్రివిక్రం పవన్ కళ్యాణ్ కాంబినేషన్ లో జల్సా..అత్తారింటికి దారేది, అజ్ఞాతవాసి వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా ఆ సినిమాలకి పూర్తి భిన్నంగా ఉండబోతుందట. ఎన్.టి.ఆర్ సినిమా కంప్లీటవగానే పవన్ కళ్యాణ్ కి కథ చెప్తారట త్రివిక్రమ్. ఇప్పటికే ఒక ఐడియా అనుకొని అది డెవలప్ చేస్తున్నారట మన మాటల మాంత్రీకుడు. త్రివిక్రమ్ పవన్ కళ్యాణ్ ల గత సినిమా అజ్ఞాతవాసి ప్రేక్షకులను బాగా డిసప్పాయింట్ చేయడంతో ఈ సారి బాక్సులు బద్దలయ్యో బ్లాక్ బస్టర్ ని ఇవ్వాలని ప్లాన్ చేస్తున్నారట గురూజీ.

Read more RELATED
Recommended to you

Latest news