వెంకీ.. బన్ని.. త్రివిక్రం మ్యాజిక్ చేస్తాడా..!

-

మాటల మాంత్రికుడు త్రివిక్రం అరవింద సమేత తర్వాత ఎలాంటి సినిమా చేస్తాడో ఎవరికి తెలియదు. అక్టోబర్ లో రిలీజ్ కానున్న అరవింద సమేత తర్వాత వెంకటేష్, బన్ని ఇద్దరు హీరోలు త్రివిక్రంతో సినిమాకు రెడీగా ఉన్నారు. ముందు వెంకటేష్ ఆ తర్వాత బన్ని సినిమాలు ఉంటాయని అనుకోగా.. ఈ ఇద్దరిని కలిపి ఓ మల్టీస్టారర్ మూవీ చేస్తున్నాడట త్రివిక్రం.

రైటర్ గా వెంకటేష్ కు మంచి హిట్లు ఇచ్చిన త్రివిక్రం దర్శకుడిగా మారాక అతన్ని డైరెక్ట్ చేయలేదు. ఇక బన్ని మాత్రం కెరియర్ అటు ఇటుగా ఉన్న టైంలో జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి సినిమాలతో సూపర్ హిట్లు కొట్టాడు. ఇప్పుడు వెంకీ, బన్నిలతో కలిసి మల్టీస్టారర్ అంటే ఇక ఆ ప్రాజెక్టుకి తిరుగులేదని చెప్పొచ్చు.

వెంకటేష్, బన్ని కలిసి సినిమా చేయడమే క్రేజీ థింగ్ అయితే.. దానికి త్రివిక్రం డైరెక్ట్ చేయడం కూడా ఈ ప్రాజెక్ట్ కు మరింత క్రేజ్ తెచ్చింది. మరి ఈ ప్రాజెక్ట్ ఫైనల్ అవుతుందా.. త్రివిక్రం వెంకటేష్, బన్ని ఇద్దరిని ఒప్పిస్తాడా అన్నది మరికొద్దిరోజుల్లో తెలుస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news