దర్శకత్వం వహించకుండా త్రివిక్రమ్ శ్రీనివాస్ స్క్రీన్ ప్లే ఇచ్చిన మూవీస్ ఇవే..

-

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఒక్క సినిమా అయినా చేయాలని ప్రతీ ఒక్క నటీ నటుడు అనుకుంటారు. ఒక్క చిన్న పాత్ర కు అవకాశం వచ్చినా స్టార్ నటులు సైతం చేసేస్తుంటారు. ఆయన పాత్రలకు అందించే డైలాగ్స్.. సినిమా మేకింగ్ స్టైల్ మిగతా వారితో పోల్చితే చాలా డిఫరెంట్ గా ఉంటుంది. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ప్రస్తుతం మహేశ్ బాబుతో SSMB 28 ఫిల్మ్ చేస్తున్నారు.

త్రివిక్రమ్ స్వయంగా తను దర్శకత్వం వహిస్తూనే పలు సినిమాలకు స్టోరి, స్క్రీన్ ప్లే అందించారు. ఆయన స్క్రీన్ ప్లే, మాటలు అందించిన చిత్రాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఇటీవల విడుదలై సూపర్ హిట్ అయిన పవర్ స్టార్ పవన్ కల్యాణ్ పిక్చర్ ‘భీమ్లా నాయక్’కు త్రివిక్రమ్ శ్రీనివాస్ ..స్క్రీన్ ప్లే తో పాటు డైలాగ్స్ అందించారు. ఈ చిత్రంలో ‘లాలా భీమ్లా’ అనే సాంగ్ లిరక్స్ కూడా త్రివిక్రమే ఇచ్చారు. పవన్ కల్యాణ్ మరో చిత్రం ‘తీన్ మార్’కు స్క్రీన్ ప్లే తో పాటు డైలాగ్స్ అందించారు.

యూత్ స్టార్ నితిన్ నటించిన ‘ఛల్ మోహన్ రంగ’ ఫిల్మ్ కు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఓన్లీ స్టోరి అందించారు. మెగాస్టార్ చిరంజీవి ‘జై చిరంజీవ’ ఫిల్మ్ కు డైలాగ్స్ ఇచ్చిన త్రివిక్రమ్ శ్రీనివాస్,.. నాగార్జున ‘మన్మథుడు’ చిత్రానికి కథ, మాటలు అందించారు. విక్టరీ వెంకటేశ్ ‘మల్లీశ్వరి’ చిత్రానికి మాటలు ఇచ్చారు. వేణు తొట్టెంపూడి నటించిన ‘స్వయం వరం’ చిత్రానికి మాటలు, కథ త్రివిక్రమ్ శ్రీనివాస్ అందించారు.

‘సముద్రం’, ‘నిన్నేప్రేమిస్తా’, ‘నువ్వే కావాలి’ , ‘వాసు’ చిత్రాలకు మాటలు ఇచ్చిన త్రివిక్రమ్.. ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రానికి స్టోరితో పాటు డైలాగ్స్ ఇచ్చారు. అలా మొత్తంగా పలు సినిమాలకు స్టోరి , స్క్రీన్ ప్లే , డైలాగ్స్ ఇచ్చిన త్రివిక్రమ్ శ్రీనివాస్.. ప్రజెంట్ తన స్నేహితుడు మహేశ్ బాబుతో సినిమా చేస్తున్నారు. ఇందులో కథానాయికగా ఆయన ఆస్థాన హీరోయిన్ బుట్ట బొమ్మ పూజా హెగ్డే ను ఫైనల్ చేశారు. ఎస్.ఎస్.థమన్ మ్యూజిక్ అందిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news