విడాకులకు సిద్ధమైన బుల్లితెర జంట.. షాక్ లో ఇండస్ట్రీ..!!

-

పటాస్ కామెడీ షో ద్వారా తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్న యాదమ్మ రాజు ఆ తర్వాత పలు కామెడీ షోలు చేస్తూ బుల్లితెరపై తనకంటూ ఒక మంచి ఫేమ్ సొంతం చేసుకున్నాడు. ఈ మధ్యకాలంలో సినిమాలలో కూడా అవకాశాలు దక్కించుకున్న ఈయన స్టెల్లా అనే అమ్మాయితో ప్రేమలో పడి ఇటీవలే పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. ఇక వీరి వివాహానికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు పెట్టి ఉంటే చాలా వైరల్ గా మారాయి. అంతేకాదు వీరి వివాహ వేడుకకు చాలామంది సెలబ్రిటీలు కూడా హాజరయ్యారు.

బుల్లితెరపై ఎంతో అన్యోన్యంగా ఉండే ఈ జంట ఉన్నట్టుండి విడాకులు తీసుకోబోతున్నారు అంటూ వీరికి సంబంధించిన ఒక వార్త నెట్టింట చాలా వైరల్ గా మారుతుంది.. యాదమ్మ రాజు భార్య స్టెల్లా.. తన భర్త పేరు మీద ఒక యూట్యూబ్ ఛానల్ ను ఓపెన్ చేసింది. అందులో పలు షోలు, ఈవెంట్స్ అంటూ తిరుగుతూ బాగానే డబ్బు సంపాదిస్తోంది. ఇక ఈ మధ్యనే మాటీవీలో వచ్చే ఒక డాన్స్ షోకి కూడా వీరిద్దరూ జంటగా వెళ్లారు. ఈ నేపథ్యంలోనే అక్కడ తాము విడాకులు తీసుకోబోతున్నట్లు చెప్పి అందరికీ షాక్ ఇచ్చారు.. అయితే అది నిజం కాదట. ఆ షో యొక్క టాపిక్ గా ఈ జంట విడిపోతున్నట్లు చెప్పుకొచ్చారు.

బుల్లితెరపై ప్రసారమవుతున్న ప్రతి కామెడీ షో లో కూడా ఏదో ఒక కొత్త టాపిక్ తో ప్రతివారం కామెడీ చేస్తూ ఉంటారు. అయితే ఈసారి యాదమ్మ రాజు ,స్టెల్లా విడాకులు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నట్లు చూపించారు. నీతో వేగడం నా వల్ల కావడం లేదు.. నాకు విడాకులు కావాలి అని స్టెల్లా అడుగుతుంది.. అంతేకాదు ఆ విడాకులు ఒక ఫంక్షన్ లా జరగాలని చెప్పడంతో ఈవెంట్ మొదలవుతుంది. ఇక ఇదంతా ప్రమోషన్స్ అని అర్థమవుతుంది. మొత్తానికి అయితే ప్రతి కామెడీ షో లో , డాన్స్ షోలో ఇలాంటివి పెడుతూ ఉండడంతో యాదమ్మ రాజు స్టెల్లా విడాకులు అంటూ ప్రచారం చేయడం సరికాదని అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news