రాంచరణ్ భార్య ఉపాసనకు ప్రతిష్ఠాత్మక ‘దాదాసాహెబ్ ఫాల్కే’ అవార్డు..!

-

ఈ అవార్డును చాలా గౌరవంగా స్వీకరిస్తున్నా. నా చుట్టూ ఉండి నన్ను రోజూ మోటివేట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి ఈ అవార్డును అంకితం ఇస్తున్నా. నాతో పాటు ఉంటూ.. నాకు మద్దతు ఇస్తున్న నా ఫ్యామిలీకి కూడా ధన్యవాదాలు..

మెగా ఫ్యామిలీలో ఉండి బిజినెస్ లో రాణిస్తూ.. సామాజిక కార్యక్రమాల్లోనూ చురుకుగా పాల్గొంటున్న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ వైఫ్ ఉపాసన ప్రతిష్ఠాత్మక అవార్డును గెలుచుకున్నారు. ఆమెకు ఈ సంవత్సరానికి దాదా సాహెబ్ ఫాల్కే ఫిలాంత్రఫిస్ట్ అవార్డు దక్కింది. ఈ విషయాన్ని ఉపాసన, రామ్ చరణ్ తమ సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా తమ అభిమానులకు తెలిపారు. ఆమె చేసిన సమాజ సేవకు గుర్తింపుగా ఈ అవార్డు ఆమెను వరించింది.

Upasana gets Dadasaheb Phalke - Philanthropist of the Year Award

డియర్ ఉప్సీ… నిన్ను చూస్తుంటే గర్వంగా ఉంది. దాదాసాహెబ్ ఫాల్కె – ఫిలాంత్రపిస్ట్ ఆఫ్ ది ఇయర్ అవార్డ్ ను గెలుచుకున్నందుకు నీకు అభినందనలు.. అని ఉపాసన అవార్డు అందుకున్న ఫోటోను తన ఫేస్ బుక్ ఖాతాలో షేర్ చేశారు.

దాదా సాహెబ్ ఫాల్కే ఫిలాంత్రఫిస్ట్ అవార్డు అందుకున్న ఉపాసన కూడా తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశారు. ఈ అవార్డును చాలా గౌరవంగా స్వీకరిస్తున్నా. నా చుట్టూ ఉండి నన్ను రోజూ మోటివేట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి ఈ అవార్డును అంకితం ఇస్తున్నా. నాతో పాటు ఉంటూ.. నాకు మద్దతు ఇస్తున్న నా ఫ్యామిలీకి కూడా ధన్యవాదాలు.. అంటూ ఉపాసన ట్వీట్ చేసింది.

Read more RELATED
Recommended to you

Latest news