స్టేజ్​పై ఎమోషనల్ అయిన ‘బేబీ’ హీరోయిన్

-

ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా బేబీ సినిమా మీమ్స్, వీడియోస్, రీల్సే కనిపిస్తున్నాయి. రిలీజ్​కు ముందే సూపర్ హైప్​ను సంపాదించుకున్న ఈ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్​ హైదరాబాద్​లో బుధవారం రోజున జరిగింది. ఈ వేడుకకు హాజరైన ఈ సినిమా హీరోయిన వైష్ణవి చైతన్య మాట్లాడుతూ ఎమోషనల్ అయింది. తల్లిదండ్రులు జన్మనిస్తే, దర్శకుడు సాయి రాజేశ్‌ నటిగా తనకు మరో జన్మనిచ్చారని పేర్కొంది. తన ప్రయాణాన్ని గుర్తుచేసుకుంటూ వేదికపై కంటతడి పెట్టుకుంది. ఆనంద్‌ దేవరకొండ హీరోగా సాయి రాజేశ్‌ తెరకెక్కించిన ఈ చిత్రం ఈ నెల 14న విడుదల కానుంది.

‘‘సమాజంలో చోటు చేసుకున్న కొన్ని సంఘటలనల ఆధారంగా ఈ సినిమాని రూపొందించారు. ఈ కథలో ప్రతి ఒక్కరూ లీనమవుతారు. యూట్యూబ్‌ వీడియోలు చేసుకుంటూ ఉండే నా దగ్గరకు ఈ ‘బేబీ’ కథ వచ్చింది. బేబీ అవకాశం నాకు వచ్చినప్పుడు ప్రధాన పాత్ర పోషించగలనా అనే భయం ఉండేది. డైరెక్టర్ రాజేశ్‌ ధైర్యాన్నిచ్చారు. ఆయన నాకు మరో జన్మనిచ్చారు. ఆయన వల్లే నేనో కొత్త ప్రపంచాన్ని చూస్తున్నా.’’ అంటూ వైష్ణవి భావోద్వేగానికి గురైంది.

Read more RELATED
Recommended to you

Latest news