మహేష్ మూవీ కోసం వంశీ ఎత్తుగడ అదిరిందిగా….!!

-

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ఇటీవల అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన సరిలేరు నీకెవ్వరు మూవీ తో మంచి విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. మహేష్ ఒక మిలిటరీ మేజర్ గా నటించిన ఈ సినిమాను మహేష్, దిల్ రాజ్, అనిల్ సుంకర సంయుక్తంగా నిర్మించారు. ఇక ఈ సినిమా ఇటీవల సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి సక్సెస్ సాధించడంతో కొద్దిరోజుల క్రితం ఈ సినిమా సక్సెస్ మీట్ ని కూడా నిర్వహించారు. ఇక ఈ సినిమా సక్సెస్ ని తన ఫ్యామిలీతో కలిసి విదేశాల్లో ఎంజాయ్ చేస్తున్న సూపర్ స్టార్ మహేష్, అతి త్వరలో ఆ టూర్ నుండి తిరిగిరాగానే మహర్షి దర్శకుడు వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ఒక సినిమా చేయనున్నారు. మహేష్ బాబు రెండు రకాల విభిన్న షేడ్స్ ఉన్న పాత్రల్లో ఈ సినిమా ద్వారా కనిపించనున్నట్లు టాక్.

మహేష్ తన జిఎంబి ఎంటర్టైన్మెంట్స్ తో పాటు దిల్ రాజు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్స్ కలిసి ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించనున్న ఈ సినిమాలో మహేష్ సరసన కియారా అద్వానీ, నిధి అగర్వాల్ హీరోయిన్స్ గా నటిస్తున్నట్లు టాక్. ఇకపోతే ఈ సినిమా సంగీత దర్శకుడిగా ఎవరిని తీసుకుంటారు అనే విషయమై కొద్దిరోజులుగా పలు మీడియా మాద్యమాలతో పాటు టాలీవుడ్ వర్గాల్లో కూడా చర్చలు నడుస్తున్న విషయం తెలిసిందే. ఇటీవల వరుసగా మూడుసార్లు మహేష్ సినిమాలకు పనిచేసిన దేవిశ్రీప్రసాద్ ని మహేష్ ఈ సినిమాకు ప్రక్కన పెట్టి, అతడి స్థానంలో థమన్ తీసుకోనున్నట్లు వార్తలు వచ్చాయి.

 

అయితే అతడి గురించి కూడా ఎటువంటి కన్ఫర్మేషన్ రాకపోవడంతో, ఈ సినిమా కోసం వారిద్దరినీ కాకుండా సీనియర్ సంగీత దర్శకుడు మణిశర్మ ని తీసుకోవాలని దర్శకుడు వంశీ ఆలోచిస్తున్నట్టు చెప్తున్నారు. ఇటీవల ఇస్మార్ట్ శంకర్ తో మంచి ఫామ్ లోకి వచ్చి ప్రస్తుతం పలు బడా సినిమాలు కూడా అందిపుచ్చుకున్న మణిశర్మ అయితేనే ఈ సినిమాకు న్యాయం చేయగలడని వంశీ భావిస్తున్నాడట. అదీకాక గతంలో మహేష్, మణి ల కాంబినేషన్లో వచ్చిన చాలా వరకు సినిమాలు సూపర్ హిట్ కొట్టడంతో, మళ్ళి ఇదే కాంబినేషన్ రిపీట్ చేసి హిట్ కొట్టాలని వంశీ ప్లాన్ చేస్తున్నాడట. మరి ప్రస్తుతం ప్రచారం అవుతున్న ఈ వార్తలో నిజానిజాలు ఎంతవరకు ఉన్నాయో తెలియాలంటే మాత్రం మరికొద్దిరోజులు వెయిట్ చేయాల్సిందే…!!

Read more RELATED
Recommended to you

Latest news