ట్రెండ్ ఇన్: సోషల్ మీడియాలో విజయ్ దేవరకొండ మేనియా..

-

రౌడీ హీరో విజయ్ దేవరకొండ నటించిన ‘లైగర్’ ఫిల్మ్ కోసం ప్రజెంట్ సినీ లవర్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. డైనమిక్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ పిక్చర్ వచ్చే నెల 25న విడుదల కానుంది. ఇందుకు సంబంధించిన పాటలు, ఫస్ట్ లుక్, ట్రైలర్ మేకర్స్ ఇటీవల విడుదల చేయగా, అవి జనాలకు విపరీతంగా నచ్చుతున్నాయి. ఇవి సినిమాపైన భారీ అంచనాలు నెలకొల్పాయి.

ఇక ప్రమోషన్స్ లో మూవీ టీమ్ ఫుల్ బిజీగా ఉంది. విజయ్ దేవరకొండ ఇటీవల హైదరాబాద్ కు వచ్చిన సమయంలో మాట్లాడిన మాటలు విని ఫ్యాన్స్ ఫుల్ ఫిదా అయిపోయారు. తన అభిమానులకు తన అయ్య, తాత ఎవడూ తెలవదని, అయినా తనను సపోర్ట్ చేస్తున్నారని అంటూ వారికి ఐ లవ్ యూ చెప్పాడు. ఆ మాటలు ప్రజెంట్ సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి.

#AyyaThathaEvadTelvadhu అయ్యా తాత ఎవడు తెల్వదు..అనే హ్యాష్ ట్యాగ్ తో ఈ వీడియోను తెగ వైరల్ చేస్తు్న్నారు నెటిజన్లు. మొత్తంగా విజయ్ దేవరకొండ ‘లైగర్’ పిక్చర్ పైన ఎక్సెపెక్టేషన్స్ బాగానే ఉన్నాయి. విడుదలకు ముందే ఈ మూవీ మేనియా కొనసాగుతుండటం చూస్తుంటే డెఫినెట్ గా ఇండియా షేక్ అయ్యేలా దర్శకుడు పూరీ జగన్నాథ్ ప్లాన్ చేశారని సినీ పరిశీలకులు అంటున్నారు. ఇందులో బాక్సింగ్ లెజెండ్ మైక్ టైసన్ నటించారు.

Read more RELATED
Recommended to you

Latest news